ట్రెండింగ్ లో పవర్ స్టార్.. ట్రెండ్ సెట్ అంటే ఇదే..!

నేను ట్రెండ్ ఫాలో అవ్వను సెట్ చేస్తా ఇది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైలాగ్.. తను చేసే సినిమాలతో యూత్ ఆడియన్స్ ను పిచ్చెక్కించేస్తాడు మన పవర్ స్టార్. అందుకే ఆయన ఫ్యాన్స్ లో యూత్ ఎక్కువ ఉంటారు. ఐతే అనూహ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హ్యాష్ ట్యాగ్ ఎక్స్ లో వైరల్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఇప్పుడు హీరో మాత్రమే కాదు పొలిటీషియన్ కూడా.. ఏపీ డిప్యూటీ సీఎం గా పవన్ తన బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

ఐతే పవన్ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవ్వడానికి ఒక కారణం అయితే బాలీవుడ్ యాక్టర్ పంకజ్ త్రిపాఠి పవన్ మీద ఆసక్తికరమైన కామెంట్స్ చేయడమే అని తెలుస్తుంది. మీర్జాపూర్ తో పాపులారిటీ సంపాదించిన పంకజ్ త్రిపాఠి పవన్ పై తనకున్న అభిమానాన్ని బయట పెట్టారు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో ఆయన పవన్ గొప్ప నటుడని అన్నారు. ఆయన పుస్తకాలు బాగా చదువుతాడు అందుకే ఆయనకు ఎంతో దూర దృష్టి ఉంటుందని అన్నారు. పవన్ గురించి ఇలాంటి విషయాలు తనకు కొందరు దర్శకులు కూడా చెప్పారని పవన్ కళ్యాణ్ కు అన్ని భాషల్లో అభిమానులు ఉన్నారని అన్నారు పంకజ్ త్రిపాఠి.

పవన్ హ్యాష్ ట్యాగ్ తో పాటుగా పంకజ్ త్రిపాఠి చేసిన ఈ కామెంట్స్ కూడా పవర్ స్టార్ ఫ్యాన్స్ ని ఖుషి చేస్తున్నాయి. టాలీవుడ్ లో భారీ అభిమాన గళం ఉన్న పవన్ కళ్యాణ్ సినిమా వస్తుంది అంటే ఫ్యాన్స్ లో ఉండే ఆ ఉత్సాహం తెలిసిందే. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఓజీ, హరి హర వీరమల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ఓజీ సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా కోలీవుడ్ స్టార్ శింబుతో ఒక సాంగ్ పాడించారని తెలుస్తుంది. సుజిత్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఓజీ సినిమాతో పవర్ స్టార్ పాన్ ఇండియా లెవెల్ లో తన సత్తా చాటనున్నారు.

పవన్ హరి హర వీరమల్లు సినిమా మార్చి 28న రిలీజ్ లాక్ చేశారు. పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల సినిమాల మీద అంత ఎక్కువ ఫోకస్ చేయలేకపోతున్నారు. ఆయన ఇచ్చిన డేట్స్ లోనే చకచకా సినిమాలు పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు మేకర్స్. వీరమల్లు, ఓజీ తర్వాత హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా లైన్ లో ఉన్న విషయం తెలిసిందే.