తేజ్ ఫోన్ చేసినప్పుడు.. అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష చిత్రాన్ని ఈనెల 21న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులతో పాటు అల్లు అరవింద్.. దిల్ రాజు ఇంకా పలువురు ఇండస్ట్రీ వర్గాల వారు ట్రైలర్ విడుదల కార్యక్రమానికి హాజరు అయ్యారు.

ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ… సాయి ధరమ్ తేజ్ నాకు ఫోన్ చేసిన సమయంలో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా చేయమని అడుగుతాడేమో అనుకున్నాను. కానీ ఈ సినిమా గురించి చెప్పి ట్రైలర్ విడుదల కార్యక్రమానికి రావాలని అడిగాడు. తేజ్ ను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను.. అతడి యొక్క పట్టుదల నాకు తెలుసు.

తేజ్ కి యాక్సిడెంట్ జరిగిన సమయంలో డాక్టర్ లు 15 నిమిషాల్లోనే ఏం కాదు.. అంతా బాగానే ఉంది అన్నారు. డేంజర్ గాయాలు ఏం కాలేదు బతికేస్తాడు అంటూ చెప్పారు. అక్కడి నుండి తేజ్ లేచి ఇప్పుడు ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాలో తేజ్ నటన గురించి అందరు మెచ్చుకుంటూ ఉంటే ఆనందంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు.

ట్రైలర్ ను చూస్తూ ఉంటే తప్పకుండా సినిమా బాగుంటుందని నమ్మకం కలుగుతుంది. వంద శాతం మంచి ఓపెనింగ్ కలెక్షన్స్ వస్తాయనే నమ్మకంగా ఉందని అల్లు అరవింద్ అన్నారు. దర్శకుడు కార్తీక్ దండు సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే విధంగా తెరకెక్కించి ఉంటాడు అని ట్రైలర్ ను చూస్తూ ఉంటే అనిపిస్తుంది. ఈ సినిమాకు అన్ని విధాలుగా కలిసి వచ్చి తప్పకుండా విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.