దేశ‌మంతా శ్రీరామస్మ‌ర‌ణ వేళ తివారీ రామాయ‌ణం!

భారతదేశపు అత్యంత ప్రాచుర్యం పొందిన ఇతిహాసాలలో రామాయణం ఒకటి. దీనిని అనేక సార్లు సినిమా, టీవీ సీరియల్‌ల రూపంలో తెరకెక్కించారు. తాజాగా, బాలీవుడ్ దర్శకుడు నితిష్ తివారీ దర్శకత్వంలో రామాయణం సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, దేవదత్ వంటి స్టార్ హీరోలు నటించనున్నారు.

ఈ సినిమా ప్రారంభానికి ముందే అయోధ్యలో రామందిరం ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలో బాలీవుడ్, టాలీవుడ్ సినీ ప్రముఖులు పాల్గొన్నారు. దీంతో రామాయణం సినిమాపై మరింత బజ్ క్రియేట్ అయింది.

రామాయణం ఒక చారిత్రక ఇతిహాసం. దీనిని టెక్నికల్‌గా హైలైట్ చేయాలి. గొప్ప విజువల్ ట్రీట్‌గా మలచాలి. ఇవన్నీ నితిష్‌కు కొత్త అన్నది టెన్షన్ పెట్టే అంశం. ఇంతవరకూ ఆయన ఇలాంటి జానర్ సినిమాలు టచ్ చేయలేదు. స్టోరీ బేస్డ్ చిత్రాలు చేసారు తప్ప టెక్నికల్‌గా ఆయన పట్టు ఎలా ఉంటుంది? అన్నది తెలియదు.

ఈ నేపథ్యంలో రామాయణం గత వైఫల్యాలు అన్నింటిని దృష్టిలో పెట్టుకుని తన రామాయణాన్ని వెండి తెరకు ఎక్కించాల్సిన బాధ్యత నితిష్‌పై ఉంది.

రామాయణం సినిమాపై అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నితిష్ ఈ అంచనాలను అందుకోగలరా? లేదా? అనేది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.