న‌య‌న‌తార వేగం జెట్ స్పీడ్ నే మించిపోతుందే

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఉమెన్ సెంట్రిక్ చిత్రాల‌పై ఎంత‌గా ఫోక‌స్ చేసిందో తెలిసిందే. ఇంత‌కాలం అమ్మ‌డు కేవ‌లం వాటి కోసం వాకింగ్ మాత్ర‌మే చేస్తుంద‌నుకున్నారంతా. కానీ ర‌న్నింగ్ నే మించి జెట్ స్పీడ్ వేగంతోనే దూసుకుపోతుంద‌ని ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. ఇటీవ‌లే 14 ఏళ్ల పాటు డైరెక్ష‌న్ కి దూరంగా ఉన్న శ‌శి కుమార్ ని రంగంలోకి దించింది. మంచి స్టోరీ వినిపించ‌డంతో శ‌షి కిర‌ణ్ ని డైరెక్ట‌ర్ గా ఎంపిక చేసుకుంది.

శ‌షి కుమార్ తో సినిమా ఏంటి? అని విమ‌ర్శ‌లొచ్చినా అమ్మ‌డు వాటిని ప‌ట్టించు కోకుండా ముందుకు క‌దులుతుంది. అలాగే విష్ణు అనే మ‌రో కొత్త కుర్రాడిని కూడా తెర‌పైకి తెచ్చింది. న‌య‌న్ ఇమేజ్ ని ఆధారంగా చేసుకుని ఓ స్టోరీ వినిపించడం..అది ఆమెకి క‌నెక్ట్ అవ్వ‌డంతో మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చింది.

ఇత‌డు లోకేష్ క‌న‌గ‌రాజ్ శిష్యుడు. తాజాగా న‌య‌న్ మ‌రో ఉమెన్ సెంట్రిక్ చిత్రానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చింది. స‌ర్జ‌న్ కె.ఎం ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌డానికి ఒకే చెప్పింది. ఈ సినిమాకి భ‌ర‌ద్వాజ్ రంగ‌న్ క‌థ అందిస్తున్నారు. స్టోరీ లైన్ ఏంటి? అన్న‌ది లీక్ అవ్వ‌లేదు కానీ కొన్ని వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా ఈ క‌థ‌ని రెడీ చేసిన‌ట్లు కోలీవుడ్ మీడియాలో ప్ర‌చారం సాగుతోంది. సంచ‌ల‌న అంశాలు ఉండ‌టంతోనే న‌య‌న‌తార ఒకే చెప్పిన‌ట్లు వినిపిస్తోంది. ప్రిన్స్ పిక్చ‌ర్స్ అనే సంస్థ ఈ సినిమాని నిర్మించ‌డానికి ముందుకొస్తుంది.

ఇలా న‌య‌న‌తార వ‌రుస‌గా లేడీ ఓరియేంటెడ్ సినిమాలో పుల్ బిజీగా మారుతోంది. బాక్సాఫీస్ వ‌ద్ద సోలోగా స‌త్తా చాటాల‌ని ఇప్పటికే కొన్ని ప్ర‌యత్నాలు చేసింది. కానీ అవేవి నూరుశాతం క‌లిసి రాలేదు. స‌రైన సౌండింగ్ హిట్ ఒక‌టీ ప‌డ‌లేదు. అలాంటి హిట్ ప‌డిన రోజు న‌య‌న్ రేంజ్ అంత‌కంత‌కు రెట్టింపు అవుతుంది. ఇప్ప‌టికే స్టార్ హీరోల‌కు జోడీగా న‌టిస్తూ తానో బ్రాండ్ గా ప్రూవ్ చేసుకున్న సంగ‌తి తెలిసిందే.