ప్రభాస్ కొత్త సినిమాలో పూజా హెగ్డే

ప్రభాస్ సరసన పూజా హెగ్డే నటించనుందనే విషయాన్ని గ్రేట్ ఆంధ్రా కొన్ని రోజుల కిందట చెప్పింది. ఇప్పుడా మేటర్ పై ఓ క్లారిటీ వచ్చింది. ప్రభాస్ సరసన నటించబోతున్నట్టు స్వయంగా పూజా హెగ్డే వెల్లడించింది. నేషనల్ మీడియాతో మాట్లాడిన ఈ బ్యూటీ.. ఈ విషయాన్ని పక్కా చేసింది.ఇప్పటికే మహేష్ బాబు సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూజా హెగ్డే. తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాలో కూడా నటించడానికి ఒప్పుకుంది. ఇప్పుడు ప్రభాస్ మూవీకి కూడా ఓకే చెప్పింది. ఇలా స్టార్ హీరోలే టార్గెట్ గా దూసుకుపోతోంది ఈ బ్యూటీ.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయాల్సి ఉంది. కథ ఎప్పుడో ఓకే చేశాడు. గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ పై రాబోతున్న ఈ సినిమాలో పూజా హెగ్డేను తీసుకున్నారు. ఈ నెలలోనే సినిమా ఓపెనింగ్ ఉంటుంది.

ప్రస్తుతం సాహో సినిమా చేస్తున్నాడు ప్రభాస్. త్వరలోనే ఈ మూవీకి సంబంధించి దుబాయ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 50రోజుల పాటు దుబాయ్, అబుదాబి, రొమేనియాలో షూట్ చేయబోతున్నారు. ఆ షెడ్యూల్ పూర్తిచేసుకొని, హైదరాబాద్ తిరిగొచ్చిన వెంటనే రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా సెట్స్ పైకి వస్తుంది.