బెల్లంకొండ శ్రీనివాస్ కొత్త సినిమా…. టైటిల్ ఏంటంటే?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూడేళ్ళ గ్యాప్ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు లైన్ లో పెట్టాడు. చివరిగా తెలుగులో అల్లుడు అదుర్స్ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేదు. తరువాత హిందీలో ఛత్రపతి రీమేక్ చేశారు. ఈ మూవీ డిజాస్టర్ అయ్యింది. దీని తర్వాత నెక్స్ట్ సినిమా విషయంలో సాయి శ్రీనివాస్ చాలా టైం తీసుకున్నారు.

ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ టైసన్ నాయుడు అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అలాగే లుదీర్ భైరెడ్డి దర్శకత్వంలో థ్రిల్లర్ జోనర్ లో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సెట్స్ పై ఉండగానే విజయ్ కుమార్ కనకమేడల దర్శకత్వంలో కొత్త సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

నాంది సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన విజయ్ కుమార్ తరువాత నరేష్ తోనే ఉగ్రం మూవీ చేశాడు. ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. దీంతో కొంత గ్యాప్ తీసుకొని తమిళ్ హిట్ మూవీ గరుడన్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు నారా రోహిత్, మంచు మనోజ్ లీడ్ రోల్ లో కనిపించబోతున్నారంట. ఈ చిత్రానికి వీర ధీర శూర అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ముగ్గురు మిత్రుల కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. మంచు మనోజ్ క్యారెక్టర్ కాస్తా నెగిటివ్ షేడ్స్ లో ఉంటుందంట. తమిళంలో గరుడన్ సూపర్ హిట్ అయ్యింది. దాంతో ఈ చిత్రంలో కొన్ని మార్పులు చేసి తెలుగు నేటివిటీకి సరిపోయే విధంగా విజయ్ కుమార్ కనకమేడల కథ రెడీ చేసాడంట. గరుడ అనే టైటిల్ ని పెట్టాలని ముందుగా అనుకున్నారంట. ఇప్పటికే ఆ టైటిల్ రిజిస్టర్ అయ్యి ఉండటంతో వీర ధీర శూర టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు సమాచారం.

త్వరలో ఈ మూవీని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసి మొదలు పెట్టబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోంది. ఇవి కాకుండా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కౌశిక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. చావు కబురు చల్లగా మూవీతో కౌశిక్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. డిఫరెంట్ కథతో కౌశిక్ సాయి శ్రీనివాస్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడంట. అంటే సాయి శ్రీనివాస్ ఏకంగా నాలుగు సినిమాలని లైన్ అప్ లో పెట్టాడు. ఇవన్నీ ఈ రెండేళ్లలోనే పూర్తి చేయడానికి ప్లానింగ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.