వెంకటేష్ మరో మల్టీస్టారర్.. ఇది సెట్టయితే..

విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో త్వరలో ప్రారంభం కానున్న ప్రాజెక్టు టాలీవుడ్‌లో బజ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం హైదరాబాదులో జూలై 3న పూజా కార్యక్రమంతో లాంచ్ కానుంది. సంక్రాంతి 2025కి విడుదల చేయాలని ప్రణాళికతో ఉన్న ఈ సినిమా షూటింగ్‌ను అనిల్ మరియు అతని టీమ్ జెట్ స్పీడ్ లో పూర్తిచేయాలని అనుకుంటున్నారు.

వెంకటేష్ ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. చాలా కాలం తరువాత వెంకీ ఇలాంటి పాత్రలో కనిపిస్తుండడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. ఇక లేటెస్ట్ వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ చిత్రం మల్టీ స్టారర్ కానుందని తెలుస్తోంది. రెండవ హీరో పాత్ర కోసం చర్చలు మొదలైనట్లుగా తెలుస్తోంది. ఈ పాత్రకు 30 నిమిషాల స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుందని టాక్.

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఈ పాత్ర కోసం నందమూరి బాలకృష్ణతో చర్చలు జరుపుతున్నాడని కూడా ఇండస్ట్రీలో బలమైన న్యూస్ వైరల్ అవుతోంది. ఒకవేళ బాలకృష్ణ అందుబాటులో లేకపోతే, ఇతర హీరోల ఎంపికల కోసం కూడా సెర్చ్ కొనసాగుతుందట. బాలకృష్ణ సానుకూలంగా స్పందిస్తే, ఈ చిత్రం మరో రేంజ్‌కు వెళ్తుందని చెప్పాలి. బాలయ్య ఇతర హీరోల సినిమాల్లో నటించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు.

గతంలో యువ హీరో మంచు మనోజ్ ఉ కొడతారా ఉలిక్కి పడతారా.. సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పుడు వెంకటేష్ అనిల్ రావిపూడి అంటే ఆయన పెద్దగా నో చెప్పకపోవచ్చు. కానీ ప్రస్తుతం బాలయ్య చాలా బిజీగా ఉన్నారు. కావున డేట్స్ విషయంలోనే అసలు సమస్య. మరి ఈ కాంబినేషన్ నిజమవుతుందో లేదో కాలమే సమాధానం ఇవ్వాలి.

ఈ చిత్రంలో హీరోయిన్‌గా మీనాక్షి చౌదరి ఎంపికయ్యింది. భీమ్స్ మ్యూజిక్ అందించనున్నాడు. ఇక సినిమాను ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా రూపొందించనున్నటు. దిల్ రాజు మరియు శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక రెగ్యులర్ షూటింగ్ జూలై మొదటి వారంలో ప్రారంభమఉహ్తుంది. వెంకటేష్ మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ పై ప్రేక్షకులు హై రేంజ్ లోనే అంచనాలు పెట్టుకుంటున్నారు. మల్టీ స్టారర్ కాన్సెప్ట్‌తో, మంచి కథ, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటే ఈ చిత్రం సంక్రాంతి సీజన్‌లో మంచి విజయాన్ని సాధించే అవకాశం ఉంది.