వెంకీ సరసన అమలాపాల్

జూన్ నుంచి సెట్స్ పైకి రానుంది అనిల్ రావిపూడి మల్టీస్టారర్ సినిమా. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా రానున్న ఈ సినిమాలో హీరోయిన్లకు సంబంధించి రోజుకో మేటర్ బయటకొస్తోంది. తాజాగా అమలాపాల్ పేరు చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో వెంకీ సరసన అమలాపాల్ ను తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

ఎప్పట్నుంచో తెలుగులో సినిమాలు చేయాలని ప్రయత్నిస్తోంది అమలాపాల్. గతంలో నాగచైతన్య, రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి హీరోల సరసన మెరిసిన ఈ బ్యూటీకి ఈసారి సీనియర్ హీరోల సరసన మాత్రమే అవకాశాలు వస్తున్నాయి. ఇక తప్పనిసరి పరిస్థితుల్లో వెంకీ సరసన నటించేందుకు ఒప్పుకుందట.అయితే అమలాపాల్ రీఎంట్రీ మూవీ మాత్రం ఇది కాదు. వెంకీ సినిమా కంటే ముందే నాగార్జున-నాని కాంబోలో రాబోతున్న మరో మల్టీస్టారర్ లో ఆమె నటించబోతోంది. ఈ ప్రాజెక్టులో నాగ్ సరసన హీరోయిన్ గా మొన్నటివరకు శ్రద్ధా శ్రీనాధ్ ను అనుకున్నారు. ఇప్పుడామె స్థానంలో అమలాపాల్ ను తీసుకున్నారట.

2015లో వచ్చిన జెండాపై కపిరాజు సినిమా తర్వాత మళ్లీ తెలుగుతెరపై కనిపించలేదు అమలాపాల్. రెండేళ్లుగా తమిళ, మలయాళ సినిమాలకు మాత్రమే పరిమితమైన బ్యూటీ.. ఇప్పుడు టాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. సెకెండ్ ఇన్నింగ్స్ లో సీనియర్లతో సినిమాలు షురూ చేసింది.