షర్మిల పార్టీలో చేరికలు మొదలు

వైఎస్‌ రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్‌ షర్మిల మొదలు పెట్టబోతున్న రాజకీయ పార్టీలో అధికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు మాత్రమే వెళ్తారు అంటూ మొదటి నుండి కొందరు రాజకీయ విశ్లేషకులు చెబుతూ వస్తున్నారు. అన్నట్లుగానే షర్మిల పార్టీలోకి ఇప్పటికే కొందరు కాంగ్రెస్ పార్టీకి చెందిన చోటా మోటా లీడర్లు వెళ్లారు. తెలంగాణలో వైకాపా లీడర్లు కూడా షర్మిల పార్టీలో జాయిన్‌ అయ్యేందుకు సిద్దంగా ఉన్నారు.

తాజాగా హైదరాబాద్‌ ఓబీసీ సెల్‌ ప్రధాన కార్యదర్శి పోల్కం శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించాడు. రాజన్న ఆశయ సాధన కోసం పార్టీని ఏర్పాటు చేయబోతున్న షర్మిలతో కలిసి నడుస్తానంటూ పోల్కం చెప్పుకొచ్చాడు. ఆమె పార్టీ ఏర్పాటు చేయడం కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో పోల్కం హైదరాబాద్‌ లో పార్టీ బలోపేతంకు కృషి చేస్తానంటూ చెప్పుకొచ్చాడు. ఆమెను కలిసిన పోల్కం పార్టీ లో జాయిన్‌ అయ్యేందుకు సిద్దం అంటూ ప్రకటించాడు.