సమంత-చైతూ రిసెప్షన్ పై కొత్త ట్విస్ట్

నాగచైతన్య-సమంత రెండుసార్లు పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 6వ తేదీన హిందు సంప్రదాయం ప్రకారం సమంత మెడలో మూడు ముళ్లు వేశాడు నాగచైతన్య. ఇక 7వ తేదీన క్రిస్టియన్ శైలిలో ఇద్దరూ రింగులు మార్చుకున్నారు. ఇలా రెండు రోజులు రెండుసార్లు పెళ్లి చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు రిసెప్షన్ లో కూడా అదే పద్ధతి పాటించాలని అనుకుంటోంది. 2 రోజులు.. 2 రిసెప్షన్లు ఇవ్వాలని భావిస్తున్నారు.

నిజానికి రిసెప్షన్ ఒకటి పెడితే సరిపోతుంది. ఎందుకంటే దీనికి సంప్రదాయాలు, పట్టింపులు అక్కర్లేదు. కానీ సమంతకు హైదరాబాద్ తో పాటు చెన్నైలో కూడా క్లోజ్ సర్కిల్ ఉంది. అందుకే వాళ్ల కోసం చెన్నైలో కూడా రిసెప్షన్ పెట్టాలనుకుంటున్నారు.

మరీ ముఖ్యంగా చెన్నై రిసెప్షన్ వెనుక సమంత తల్లి హస్తం ఉంది. గోవాలో జరిగిన పెళ్లిలో పెద్దగా కనిపించని (ఫొటోల్లో అస్సలు కనిపించలేదు) సమంత తల్లి, కూతురు-అల్లుడు సమక్షంలో చెన్నైలో పెద్ద పార్టీ ఇవ్వాలనుకుంటోందట. ఈ వేడుకకు కోలీవుడ్ కు చెందిన ప్రముఖులు హాజరవుతారు.

చెన్నైలో తంతు పూర్తయిన తర్వాతే హైదరాబాద్ లో రిసెప్షన్ ఉంటుందట. మధ్యలో చెన్నై ఫంక్షన్ వచ్చి చేరడంతో డేట్ ఫిక్స్ చేయలేకపోతున్నాడు నాగార్జున. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ ఫస్ట్ వీక్ లో హైదరాబాద్ లో నాగార్జున ఆధ్వర్యంలో రిసెప్షన్ జరిగే ఛాన్స్ ఉంది.