సాయి పల్లవి నెవర్ చేంజ్..!

ప్రేమమ్ సినిమాతో మలార్ గా సౌత్ ఆడియన్స్ మనసు దోచేసిన సాయి పల్లవి ఆ తర్వాత తెలుగులో ఫిదా మూవీతో తెలుగులో ఛాన్స్ అందుకుంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో తెరకెక్కిన ఫిదా సినిమాలో భానుమతి ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్లా అంటూ సాయి పల్లవి చేసిన యాక్టింగ్ కు తెలుగు ఆడియన్స్ పడిపోయారు. ఆ సినిమా నుంచి సాయి పల్లవి మూవీ అంటే అటెన్షన్ చూపించడం మొదలు పెట్టారు. సాయి పల్లవి కూడా గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ తనకు ఇచ్చిన పాత్రలకు ప్రాణం పోస్తూ వస్తుంది

నటిగా తనని తాను సినిమా సినిమాకు ఇంకాస్త మెరుగు పరచుకునే ప్రయత్నంలో సాయి పల్లవి తన మార్క్ చూపిస్తూ వస్తుంది. తన మీద ఆడియన్స్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో సాయి పల్లవి ది బెస్ట్ అనిపించుకుంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది హీరోయిన్స్ ఉన్నా కూడా ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువ శాతం సాయి పల్లవి మీద ఉంది. ఆమె చేసే సినిమాలు ఎంచుకునే పాత్రలు ఆడియన్స్ ని సూపర్ సాటిస్ఫై చేస్తున్నాయి.

కెరీర్ పరంగా ఈమధ్య కాస్త గ్యాప్ తీసుకున్న సాయి పల్లవి ప్రస్తుతం నాగ చైతన్యతో తండేల్ సినిమా చేస్తుంది. ఈ సినిమాతో పాటుగా బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తనయుడితో కలిసి ఒక మూవీ ఫిక్స్ చేసుకుంది. బాలీవుడ్ లో కూడా సాయి పల్లవికి వరుస ఆఫర్లు వస్తున్నా కేవలం పాత్ర ప్రాధాన్యత ఉన్న సినిమాలే తప్ప వేరే వాటిని కాదనే కండీషన్ అక్కడ కూడా కొనసాగిస్తుంది. తనకు నచ్చిన కథ కోసం రెమ్యునరేషన్ లో కాస్త తక్కువైనా తీసుకునే సాయి పల్లవి నచ్చని కథ కోసం రెట్టింపు పారితోషికం ఇస్తానన్నా కూడా ఆమె ఒప్పుకునే ఛాన్స్ లేదు. అందుకే హీరోయిన్స్ లో సాయి పల్లవి సంథింగ్ స్పెషల్ అనిపించేలా క్రేజ్ తెచ్చుకుంది.

సౌత్ నుంచి బాలీవుడ్ వెళ్లినా కూడా సాయి పల్లవి మాత్రం ఏమాత్రం మారదు.. మారలేదని అంటున్నారు. సాయి పల్లవి చేస్తున్న ఈ సినిమాల వల్ల ఆమె పాపులారిటీ రోజు రోజుకి డబుల్ అవుతున్నా కూడా సినిమాల సెలక్షన్ లో తను నెవర్ చేంజ్ అనిపించుకుంటుంది అమ్మడు. బాలీవుడ్ లో రామాయణం సినిమాలో కూడా సీత పాత్రలో సాయి పల్లవి నటిస్తుందని తెలుస్తుంది. రణ్ బీర్ కపూర్ రాముడిగా చేస్తున్న రామాయణంలో సీతగా ప్రేక్షకులను తన నటనతో మెస్మరైజ్ చేయాలని చూస్తుంది సాయి పల్లవి.