బ్రహ్మూత్సవం ఫ్లాప్ అయినపుడు తీసుకున్న పారితోషికంలో కొంత నిర్మాతకి తిరిగి ఇచ్చిన మహేష్ బాబు తన తాజా చిత్రం స్పైడర్ కూడా ఘోర పరాజయం పాలవడంతో తన వంతు బాధ్యత తీసుకున్నాడు. నిర్మాత ఎన్వీ ప్రసాద్కి తాను తీసుకున్న పారితోషికంలో నాలుగోవంతు తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చాడు.
స్పైడర్ చిత్రానికి ఏడాదిన్నర సమయం కేటాయించిన మహేష్, చాలా రోజుల పాటు షూటింగ్లో పాల్గొన్నాడు. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన ఈ చిత్రం కోసం అతనికి ఇరవై మూడు కోట్ల పారితోషికం ఇచ్చినట్టు వార్తలొచ్చాయి. ఈ పరాజయంతో తనకేమీ సంబంధం లేకపోయినప్పటికీ నిర్మాత భారాన్ని షేర్ చేసుకుంటున్నాడు.
మామూలుగా అయితే మరో సినిమా చేసి పెడతామని మాట ఇచ్చేసి ఊరుకుంటారు. కానీ అది ప్రాక్టికల్గా సాధ్యమయ్యేది కాదు కనుక మహేష్ పారితోషికం తిరిగి ఇచ్చి నిర్మాతకి బాసటగా నిలిచాడు. భరత్ అనే నేను చిత్రం మీద దృష్టి పెట్టిన మహేష్ ఈసారి ఈ చిత్రం విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.