ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ కాంపౌండ్ కే

చిరకాలంగా తెలుగులో ఎంట్రీ ఇస్తారు అని వినిపిస్తున్న పరభాష డైరక్టర్లలో ప్రశాంత్ నీల్ ఒకరు. సూపర్ స్టార్ మహేష్ బాబు మైత్రీ మూవీస్ సంస్థ ద్వారా ఆయనను ప్రత్యేకంగా కబురుచేసారని కూడా వార్తలు వచ్చాయి. ఈ విషయంలో లేటెస్ట్ న్యూస్ ఏమిటంటే, ప్రశాంత్ నీల్ ప్రాజెక్టు కూడా ఎన్టీఆర్ కే వెళ్లిపోయిందని. ఎన్టీఆర్ తో చేయడానికే ప్రశాంత్ నీల్ ఇష్టపడుతున్నాడని తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఆర్ట్స్-మైత్రీ మూవీస్ బ్యానర్ మీద ఈ సినిమా తయారవుతుంది. త్రివిక్రమ్ సినిమా తరువాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇదేనని బోగట్టా. కేజిఎఫ్ సినిమా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్. అతనితో సినిమా చేయాలని మహేష్ అనుకున్నా మరి ఎందుకో సాధ్యం కాలేదు.

ఒకప్పుడు హీరోల్లో సరైన లైనప్ లేదు అనుకున్న ఎన్టీఆర్ ఇప్పుడు వరుసగా రాజమౌళి, త్రివిక్రమ్, ప్రశాంత్ నీల్ సినిమాలు చేతిలో వుంచుకున్నాడు. ఇది కాక డేట్ లు ఇస్తే చాలు కొరటాల శివ రెడీ. ఇకపై ప్రతి సినిమా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ కాంబినేషన్ లోనే రెడీ అవుతుందని తెలుస్తోంది.