వైసీపీ ఎమ్మెల్యేపై కోవిడ్ కేసు, టిడిపి మాజీ మంత్రిపై నిర్భయ కేసు.!

గత కొద్దిరోజులుగా టిడిపి నాయకులపై పలు చోట్ల పలు విధాలుగా కేసులు నమోదవుతున్నాయి. అందులో కొంతమంది పోలీసుల విచారణలో భాగంగా రిమాండ్ లో కూడా ఉన్నారు. ఇది పక్కన పెడితే, తాజాగా మరో టిడిపి పార్టీ మంత్రిపై కేసు నమోదైంది. అది కూడా నిర్భయ కేసు కావడం అందరినీ షాకింగ్ కి గురి చేస్తోంది. టిడిపి మాజీ మంత్రి, పార్టీ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడిపై విశాఖపట్నం జిల్లా, నర్సీపట్నం పురపాలక సంఘం కమీషనర్ కృష్ణవేణి ఫిర్యాదు చేయడంతో, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్టు సీఐ స్వామి నాయుడు తెలిపారు. గతంలో పురపాలక కార్యాలయంలోని మాజీ సర్పంచ్ రుత్తల లచ్చపాత్రుడు చిత్రపటం తొలగించే విషయంలో అయ్యన్నపాత్రుడు గొడవ చేయడమే కాకుండా, తనపై అసభ్యకరమైన మాటలతో దాడిచేశారని కృష్ణవేణి ఫిర్యాదులో తెలిపింది.

మరోవైపు కోవిడ్ నిభందనలు నడుస్తున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా విశాఖపట్నంలో వైసీపీ వర్గీయులు దాడులకు పాల్పడ్డారు. అందులో భాగంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై సెక్షన్ 188 కింద కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. ఇలా అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీ నేతలు రకరకాల కేసుల్లో పోలీసులకి బుక్కయ్యారు.