బెంగళూరు ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ కు రామ్ చరణ్..!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ బెంగళూరులోని ఫామ్ హౌస్ నుంచి నేడు హైదరాబాద్ కు వస్తున్నారు. ఇటివల ఆయన స్టాఫ్ కరోనా బారిన పడి మృతి చెందారు. దీంతో ఆయన ముందుజాగ్రత్త చర్యగా బెంగళూరులోని ఫామ్ హౌస్ లో సెల్ఫ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. అయితే.. కర్ణాటకలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంతో రెండు వారాల లాక్ డౌన్ విధించింది రాష్ట్ర ప్రభుత్వం. రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి వస్తూండటంతో ఈరోజు ఆయన హైదరాబాద్ కు వస్తున్నారని తెలిసింది.

ఆచార్య టీమ్ లోని సోనుసూద్, పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో టీమ్ కూడా షూటింగ్ ను వాయిదా వేసింది. రామ్ చరణ్ గతేడాది కరోనా వైరస్ బారిన పడ్డారు. వెంటనే కోలుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఆచార్యలో సిద్ధ పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది.