సోనాలి బింద్రే రీ ఎంట్రీ.. క్యాన్సర్పై గెలిచి మళ్లీ ఇలా..!

సోనాలి బింద్రే.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ముంబైలో జన్మించిన ఈ ముద్దుగుమ్మ.. ‘మురారి’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మహేష్ బాబుకు జోడీగా నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన సోనాలి.. ఆ తర్వాత ఇంద్ర శంకర్ దాదా ఎంబీబీఎస్ ఖడ్గం మన్మథుడు పల్నాటి బ్రహ్మానాయుడు ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలు చేసి స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకుంది.

అలాగే మరోవైపు తమిళ కన్నడ మరాఠీ హిందీ చిత్రాల్లోనూ నటించిన సోనాలి బింద్రే.. 2018లో ప్రణాంతకమైన మెటాస్టాటిక్ క్యాన్సర్కు గురైంది. బతకడానికి ముపై శాతం మాత్రమే అవకాశం ఉందని వైద్యులు చెప్పినా.. సోనాలి కృంగిపోలేదు. మానసిక స్థైర్యంతో మరింత ధైర్యంగా నిలబడింది.

న్యూయార్క్లో చాలా రోజుల పాటు చికిత్స తీసుకున్న అనంతరం క్యాన్సర్ మహమ్మారిని ఓడించి ఇండియాకు తిరిగి వచింది.

ప్రస్తుతం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న సోనాలి.. రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దాదాపు నాలుగేళ్లు ప్రేక్షకులకు కనిపించని ఈ బ్యూటీ.. మళ్లీ కెమెరా ముందు వచ్చేసింది. అయితే ఈమె వెండితెరపై కాకుండా బుల్లితెరపై సందడి చేయబోతోంది. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ లిటిల్ మాస్టర్స్ సీజన్ 5 షోకి ఈమె జడ్జ్గా వ్యవహరిస్తోంది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా స్వయంగా తెలియజేసిన సోనాలి బంద్రే.. క్యాన్సర్పై గెలిచి మళ్లీ ఇలా మీ అందరి ముందుకీ రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. కాగా లిటిల్ మాస్టర్స్ రియాలిటీ షో మార్చి 11వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది.

ఇప్పటికే విడుదలైన ప్రోమోలు ఫొటోల్లో సోనాలి బింద్రే ఎంతో హుషారు కనిపిస్తూ అందరినీ ఎంట్రాక్ట్ చేస్తోంది.