లక్ష టికెట్లు బుక్‌… అరవ ‘ఒక్కడు’ అదరగొట్టుడు!

మహేష్ బాబుకు సూపర్‌ స్టార్‌ ఇమేజ్ ను తెచ్చి పెట్టిన సినిమాల్లో ఒక్కడు ప్రధానమైన సినిమా అనడంలో సందేహం లేదు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ఎంఎస్ రాజు నిర్మించిన ఒక్కడు సినిమా టాలీవుడ్‌ లో అప్పటి వరకు ఉన్న పలు రికార్డులను బ్రేక్ చేసింది. భారీ బడ్జెట్‌ తో రూపొంది, భారీ వసూళ్లు రాబట్టింది.

సినిమాలో చూపించిన ప్రతి పాయింట్ కూడా ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యింది. అందుకే ఒక్కడు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఒక్కడు సినిమా తెలుగు లో హిట్‌ నేపథ్యంలో తమిళంలో విజయ్ హీరోగా గిల్లీ పేరుతో రీమేక్‌ చేశారు.

విలన్‌ గా ప్రకాష్ రాజ్‌ ను కొనసాగించి, హీరోయిన్ గా భూమిక ప్లేస్ లో త్రిషను నటింపజేశారు. కథ, కథనం ఏ మాత్రం మార్చకుండా మక్కీకి మక్కీ దించేశారు. అయినా కూడా తెలుగు ఒక్కడు వచ్చిన రేంజ్ లో గిల్లీ రాలేదు అనేది అప్పట్లో సినీ విశ్లేషకుల వాదన.

గిల్లీ ని తమిళ ప్రేక్షకులు అప్పట్లో విపరీతంగా ఆదరించారు. రెండు దశాబ్దాల క్రితం వచ్చిన గిల్లీ సినిమాను తమిళనాట రీ రిలీజ్ చేశారు. భారీ ఎత్తున చేసిన ప్రచారం నేపథ్యంలో విడుదలకు రెండు రోజుల ముందే దాదాపుగా బుక్ మై షో ద్వారా 60 వేల టికెట్లు అమ్ముడు పోయాయి.

విడుదల సమయం కు లక్ష టికెట్లకు పైగా అమ్ముడు పోయాయి అంటూ సమాచారం. చెన్నై లో ఏకంగా 300 షో లు వేయడం జరిగింది. విజయ్ ఫ్యాన్స్‌ గిల్లీ సినిమాకు మరోసారి బ్రహ్మరథం పట్టారు. తమిళనాట భారీ ఎత్తున విడుదల అయిన గిల్లీ సినిమాకు భారీ ఎత్తున వసూళ్లు నమోదు అయినట్లు తెలుస్తుంది.

మొత్తానికి మన ఒక్కడు సినిమాను తమిళ ప్రేక్షకులు ఓన్ చేసుకున్న విధానం చూస్తూ ఉంటే ముచ్చటేస్తుంది. తెలుగు లో హిట్‌ అయిన సినిమా లు చాలా తమిళనాట బొక్క బోర్లా పడ్డాయి. కానీ గిల్లీ మాత్రం అక్కడ భారీ విజయాన్ని సొంతం చేసుకుని, రీ రిలీజ్ లోనూ అదరగొట్టడం విశేషం.