స్టార్ కిడ్స్ అంతా క‌లిస్తే దాడి ఇలా ఉంటుందా?

ఇండ‌స్ట్రీ అంటే వాళ్ల‌లో వాళ్లే. కొత్త వాళ్ల‌కి అక్క‌డ ఛాన్సులిచ్చేదెవ‌రు? అన్న అప‌వాదను దేశంలో అన్నిసిని పరిశ్ర‌మ‌లు మోస్తున్న‌వే. నెపోటిజం అన్న‌ది పీక్స్ లో ఉంద‌ని అవ‌కాశాలు రానివాళ్లంతో ఎన్నో సార్లు ఆరోపించారు. చివ‌రికి బాలీవుడ్ న‌ట‌డు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మ‌ర‌ణానికి ఈ నెపోటిజం కూడా ఓ కార‌ణాల్లో ఒక‌టిగా హైలైట్ అయింది. ఈ నేప‌థ్యంలో తాజాగా నెపోటిజాన్నిమ‌రింత హైలైట్ చేస్తూ నెట్టింట ట్రోలింగ్ జ‌ర‌గ‌డం చ‌ర్చ‌కొస్తుంది. ఇంత‌కీ ఈ చ‌ర్చంతా దేనికి అంటే వివ‌రాల్లోకి వెళ్లాల్సిందే.

కోలీవుడ్ స్టార్ చియాన్ విక్ర‌మ్ త‌న‌యుడు ధృవ్ హీరోగా ఇప్ప‌టికే ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే ఓ మూడు సినిమాలు చేసాడు. కానీ ధృవ్ కి ఇంకా స‌రైన గుర్తింపు రాలేదు. డాడ్ గ్రేట్ యాక్ట‌ర్ అయినా! ఆయ‌న వార‌స‌త్వాన్ని తీసుకుని న‌టుడిగా ఎంట్రీ ఇచ్చిన ధృవ్ కి మాత్రం ఇంకా స‌రైన స‌క్సెస్ ప‌డ‌లేదు. అలాగే స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కుమార్తె అతిది శంక‌ర్ కూడా `వీరుమాన్` తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

తొలి సినిమా స‌క్స‌స్ తో అమ్మ‌డికి మంచి గుర్తింపు ద‌క్కింది. అటుపై మ‌రో రెండు సినిమాల్లోనూ న‌టించింది. అయితే ఇవి ఆశించిన ఫ‌లితాలు సాధించ‌లేదు. ఇక త‌ల‌ప‌తి విజ‌య్ త‌న‌యుడు జేస‌న్ సంజ‌య్ ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుత‌న్నాడు. మ‌రోవైపు మ్యూజిక్ లెజెండ్ రెహ‌మాన్ మేన‌ల్లుడు కూడా సంగీత ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పుడు వీళ్లంతా క‌లిసి ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది. దీంతో నెట్టింట న‌లుగురిపై ట్రోలింగ్ పీక్స్ కి చేరింది. వాళ్ల‌లో వాళ్లే క‌లిసి అంతా ఓ కూట‌మిగా ఏర్ప‌డి సినిమా చేసుకుంటున్నారు. కొత్త వారు ..బ‌య‌ట వారు లేకుండా అంటూ నెపోటిజాన్ని తెర‌పైకి తెస్తున్నారు. ఈ చిత్రానికి `తప్పక అప్పా` అనే టైటిల్ పెట్టాలం టూ ఓ యూజ‌ర్ ద‌ర్శ‌కుడికి స‌ల‌హాలు ఇచ్చాడు. ఎవ‌రి స్టైల్లో వారు కామెంట్లు..ఎమోజీలు.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. సినిమా ప్రారంభానికి ముందే ఇలా ఉందంటే? ప్రారంభ‌మైన త‌ర్వాత ర‌చ్చ ఇంకే రేంజ్లో ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.