మాస్ కా దాస్ రేంజ్ జ‌పాన్ వ‌ర‌కూ వెళ్లిందా?

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ఎన‌ర్జీ లెవ‌ర్స్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అత‌డి ఎన‌ర్జీకే బోలెడంత ఫాలోయింగ్ ఉంది. బాల‌య్య‌, తార‌క్, చ‌ర‌ణ్‌, వెంక‌టేష్ లాంటి హీరోలు సైతం విశ్వ‌క్ ని లైక్ చేస్తున్నా రంటే? అత‌డిలో ఎన‌ర్జీ చూసే అన‌డంలో అతిశయోక్తి లేదు. అత‌డిలో ఎన‌ర్జిటిక్ పెర్పార్మెన్స్ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు తీసుకొచ్చింది. ఇక కుర్రాళ్ల‌లో విశ్వ‌క్ ఫాలోయింగ్ గురించైతే చెప్పాల్సిన ప‌నిలేదు.

మాస్ కాదాస్ అంటూ అభిమానులు నెట్టింట చేసే హంగామా మామూలుగా ఉండ‌దు. సోష‌ల్ మీడియా లోనూ మంచి ఫాలోయింగ్ ఉన్న న‌టుడు. కానీ అత‌డి రేంజ్ జ‌పాన్ వ‌ర‌కూ పాకింద‌న్న సంగ‌తి ఇప్పుడే బ‌య‌ట ప‌డింది. తాజాగా కొంత మంది జ‌పాన్ అభిమానులు నేరుగా విశ్వ‌క్ ఇంటికి చేరుకుని అత‌డితో సెల్పీలు దిగారు. విశ్వ‌క్ సేన్ కి ప్ర‌త్యేకంగా కొన్ని జ‌పాన్ బొమ్మ‌లు అందించారు. అలాగే జ‌ప‌నీస్ లో అభిమానంతో కొన్ని లేఖ‌లు రాసారు.

జ‌పాన్ అభిమానుల్ని ఎంతో విన‌యంగా విశ్వ‌క్ సేన్ క‌లిసాడు. వాళ్ల‌తో క‌లిసి కాసేపు ముచ్చ‌టించి సెల్పీలు దిగాడు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటి జ‌నులు స‌ర్ ప్రైజ్ అవుతున్నారు. విశ్వ‌క్ సేన్ కి జ‌పానోళ్లు కూడా అభిమానులుగా మారారా? అంటూ ఆశ్చ‌ర్య పోతున్నారు. మ‌రేమ‌నుకుంటున్నారు మాస్ కా దాస్ అంటే?

ఇక విశ్వ‌క్ సేన్ కెరీర్ మ‌ళ్లీ ప‌ట్టాలెక్కిన సంగ‌తి తెలిసిందే. ఈ ఏడాది `గామీ`తో భారీ సక్సెస్ అందుకు న్నాడు. అత‌డి శైలికి భిన్న‌మైన సినిమా ఇది. వైవిథ్య‌మైన పాత్ర‌లో మెప్పించాడు. అటుపై `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి`తో మ‌రో విజ‌యం ఖాతాలో వేసుకున్నాడు. మ‌రోసారి మాస్ కా దాస్ పెర్పార్మెన్స్ తో అద‌ర గొట్టాడు.