విరాట్‌ – అనుష్క, చరణ్ – ఉపాసన.. ఇప్పుడు రణ్‌వీర్‌ – దీపిక

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ రణ్‌ వీర్‌ సింగ్‌, దీపికా పదుకునే ఇటీవలే తల్లిదండ్రులు అయిన విషయం తెల్సిందే. ఆడ బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకునే ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అయింది. సాధారణంగా సెలబ్రెటీలు తమ పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత వారే స్వయంగా సోషల్‌ మీడియా ద్వారా వారి పిల్లల ఫోటోలను షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ కొందరు స్టార్‌ కపుల్‌ మాత్రం ఏళ్లకు ఏళ్లు తమ పిల్లలను మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇప్పటి వరకు విరాట్‌ – అనుష్క, చరణ్‌ – ఉపాసన పిల్లల ఫోటోలు బయటకు రాలేదు.

విరాట్‌, చరణ్ దంపతుల మాదిరిగానే రణవీర్‌ సింగ్ దంపతులూ తమ పాప ఫోటోను బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇటీవల దీపికా పదుకునే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సమయంలో ముందు గేటు నుంచి కాకుండా ఆసుపత్రికి వెనుక వైపు ఉన్న గేటు నుంచి వెళ్లింది. మీడియా కంట పడకుండా దీపికా ను వెనుక నుంచి రణ్‌వీర్ సింగ్ తీసుకు వెళ్లాడట. మీడియా వారితో స్వయంగా రణ్‌వీర్ సింగ్ మాట్లాడి తమ కూతురు ఫోటోలను మీడియా లో రాకూడదని భావిస్తున్నాం. కనుక పాప తో బయటకు వచ్చిన సమయంలో మీడియా వారు ఫోటోలు తీయవద్దని విజ్ఞప్తి చేయడం జరిగిందట.

దీపికా పదుకునే ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో పాటు, తల్లి బిడ్డ క్షేమం అంటూ అధికారిక ప్రకటన రావడంతో మీడియా వారితో పాటు ఆమె ఫ్యాన్స్ అంతా బేబీ ఫోటోలతో పాటు, డెలివరీ అనంతరం దీపికా పదుకునే లుక్ ఎలా ఉంటుంది అనే విషయాన్ని గురించి చర్చించుకుంటున్నారు. ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన సమయంలో మీడియా వారు ఆమెను కెమెరాల్లో బంధించాలని భావించినప్పటికీ వెనుక గేటు నుంచి ఆమె వెళ్లి పోవడంతో అది సాధ్యం కాలేదు. పైగా రణ్‌వీర్ సింగ్‌ మీడియాకు ఇప్పట్లో పాప ఫోటో, దీపికా ఫోటోలు తీయవద్దని రిక్వెస్ట్‌ చేశాడు. దాంతో ఇప్పట్లో తల్లి బిడ్డలను చూసే అవకాశం లేదు.

స్టార్స్ పిల్లలు అంటే చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. అలా ఇప్పటికే విరాట్‌ కోహ్లీ – అనుష్క, చరణ్‌ – ఉపాసన దంపతుల పిల్లల ఫోటోలు సోషల్ మీడియా ద్వారా కొందరు లీక్‌ చేయడం, అవి వైరల్‌ అవ్వడం కామన్ గా చూస్తూ ఉంటాం. చాలా మంది సెలబ్రెటీలు ఏదో ఒక రూపంలో పిల్లల ఫోటోలు బయటకు లీక్ అవుతాయి. కనుక మనమే అధికారికంగా రిలీజ్ చేస్తే పోయేది ఏముంది అనుకుంటారు. కానీ రణ్‌వీర్ సింగ్ – దీపికా పదుకునే దంపతులు మాత్రం ఇప్పట్లో తమ బేబీ లుక్ ని రివీల్‌ చేయకూడదని ఫిక్స్ అయినట్లుగా ఉన్నారు. అందుకే మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడి రణ్‌వీర్ సింగ్ విజ్ఞప్తి చేయడం జరిగింది.