అనుష్క ఫ్యాన్స్‌ కోసం.. రెండేళ్ల తర్వాత డబుల్‌ ధమాకా!

‘బాహుబలి’ తర్వాత పాన్‌ ఇండియా స్టార్‌ హీరోయిన్‌గా మరిన్ని సినిమాలు చేస్తుంది అనుకున్న అనుష్క చాలా స్లో అయింది. బాహుబలి 2 తర్వాత ఆమె నుంచి ఇప్పటి వరకు భాగమతి, నిశబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలు మాత్రమే వచ్చాయి. ఏడు సంవత్సరాల కాలంలో ఆమె నుంచి కేవలం మూడు సినిమాలే రావడం ఆమె ఫ్యాన్స్‌కి నిరాశను కలిగిస్తుంది. అనారోగ్య సమస్యల కారణంగా అనుష్క సినిమాలను ఎక్కువ చేయడం లేదని కొందరు మాట్లాడుతూ ఉంటే, మరికొందరు ఆమెకు మంచి కథలు దొరక్క పోవడం వల్ల సినిమాలకు కమిట్‌ అవ్వడం లేదని అంటున్నారు. కారణం ఏదైనా ఆమె సినిమా వచ్చి రెండేళ్లు అవుతుంది. రెండేళ్ల తర్వాత అనుష్క నుంచి ఒకేసారి రెండు సినిమాలు రాబోతున్నాయి.

ఏడాదికి ఒక్క సినిమాను చేయలేదని ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఈ సమయంలో అనుష్క ఏకంగా రెండు సినిమాలతో 2025లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదటగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఘాటీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో అనుష్క తో వేదం సినిమాను రూపొందించిన క్రిష్ ఘాటీ సినిమాను చాలా విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపొందించాడట. గతంలో ఎప్పుడూ లేని విధంగా, చూడని విధంగా అనుష్కను బోల్డ్‌ పాత్రలో చూస్తారంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లోనే ఘాటీ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ అనుష్క సన్నిహితులు చెబుతున్నారు.

ఘాటీ సినిమాతో పాటు అనుష్క మలయాళంలో ‘కథనార్: ది వైల్డ్ మాంత్రికుడు’ అనే సినిమాను సైతం చేస్తుంది. ఇటీవలే ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిందని యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందుతోంది. ఈ రెండు సినిమాలు పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల అవ్వబోతున్నాయి. ఘాటీ సినిమా పూర్తిగా తెలుగు లో రూపొందగా, కథనార్ ను పూర్తిగా మలయాళంలో రూపొందించడం జరిగింది. రెండు సినిమాలు కొద్ది గ్యాప్‌తోనే ప్రేక్షకుల ముందుకు వస్తాయనే వార్తలు వస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా అనుష్క కొత్త సినిమాలు ఉంటాయని ఫ్యాన్స్ చాలా నమ్మకంతో ఉన్నారు. అనుష్క నుంచి ఒకే ఏడాది రెండు సినిమాలు రావడం పట్ల ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అనుష్క మిస్ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి సినిమాతో డీసెంట్‌ హిట్‌ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో తన వయసుకు తగ్గట్లుగా యంగ్‌ హీరో కంటే పెద్ద ఏజ్‌ గ్రూప్ పాత్రలో కనిపించి మెప్పించింది. అనుష్క ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఓకే చెబుతోంది. ప్రస్తుతం చేస్తున్న ఈ రెండు సినిమాలు సైతం లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు అనే విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ రెండు సినిమాల తర్వాత సైతం అనుష్క బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. ఈ మధ్య కాలంలో అనుష్క ను కథలతో సంప్రదిస్తున్న దర్శకులు ఎక్కువ అయ్యారు. కనుక అనుష్క నుంచి వరుసగా సినిమాలు వస్తాయని ఫ్యాన్స్ తో పాటు అంతా నమ్మకంగా ఉన్నారు.