విజయ్ సేతుపతితో కలిసి స్క్రీన్ పంచుకోనున్న అనుష్క

అనుష్క శెట్టి ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించేసింది. తనకు ఆఫర్లకు కొదవ లేకపోయినా చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. కారణాలు తెలియదు కానీ ఎక్కువ సినిమాలు చేసే ఉద్దేశమైతే అనుష్కకు లేనట్లు ఉంది. నిశ్శబ్దం సినిమాను ఈ ఏడాది పూర్తి చేసింది అనుష్క. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్ ప్రభావం వల్ల నిశ్శబ్దం విడుదల కాకుండా ఆగిపోయింది. ఓటిటి ప్లాట్ ఫామ్ లో నిశ్శబ్దం చిత్రాన్ని విడుదల చేస్తారని వార్తలు వచ్చాయి కానీ అదంతా అబద్దమని తేలిపోయింది. నిశ్శబ్దాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. అది ఎంత ఆలస్యమైనా కానీ.

నిశ్శబ్దం తర్వాత అనుష్క మరో సినిమాకు సంతకం చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం అనుష్క తన తర్వాతి చిత్రాన్ని దర్శకుడు విజయ్ తో చేయబోతున్నట్లు తెలుస్తోంది. మరో విశేషమేమిటంటే ఈ చిత్రంలో హీరోగా విజయ్ సేతుపతిని అనుకుంటున్నారట. అయితే ఇందులో అనుష్కదే ప్రధాన పాత్ర అని, ఒక స్పెషల్ రోల్ లో విజయ్ సేతుపతి కనిపించనున్నారని తెలుస్తోంది.