మిడ్ నైట్ లో అమైరా అండ్ గాళ్స్ గ్యాంగ్ రచ్చ

`మనసుకు నచ్చింది` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఉత్తరాది బ్యూటీ అమైరా దస్తూర్. కానీ తొలి సినిమా నిరాశ పరచడంతో అటుపై అవకాశాలు దక్కలేదు. కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో ప్రయత్నించి చివరికి బాలీవుడ్ లో స్థిరపడింది. ప్రస్తుతం అక్కడే ఏడాదికో సినిమా చొప్పున నటిస్తోంది. అక్కడా అంత బిజీనటిగా క్రేజ్ దక్కించుకోవడంలో వెనుకబడే ఉంది.

అయితే ఇటీవల డిజిటల్ లో అవకాశాలు మెరుగయ్యాయి. వెబ్ సిరీస్ లతో ఫేమస్ అవుతోంది. ఇప్పటికే రెండు వెబ్ సిరీస్ ల్లో నటించింది. మూడవ వెబ్ సిరీస్ రిలీజ్ కి రెడీ గా ఉంది. బోల్డ్ కంటెంట్ లో అమ్మడు అందాలు ఓ రేంజ్ లో ఎలివేట్ చేస్తూ అమైరా ఘాటైన నటనతో ఆకట్టుకుంటోందన్న టాక్ ఉంది.

ప్రస్తుతం `డోంగ్రీ టూ దుబాయ్` అనే ఓ సీరిస్ లో నటిస్తోంది. వచ్చే ఏడాది ఇది రిలీజ్ కానుంది. ఇంగ్లీష్ వెబ్ సిరీస్ ల్లోనూ నటిస్తూ అంతర్జాతీయ స్థాయికి రీచ్ అవ్వాలని వెయిట్ చేస్తోంది. ఇక అమైరా సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఎంటుందో తెలిసిందే. ఎప్పటికప్పుడు హాటెస్ట్ ఫోటోలతో హీట్ పుట్టిస్తుంది. బికీనీ..టూపీస్ ల్లో టూమచ్ గా అందాలు ఆరబోస్తూ యూత్ అటెన్షన్ డ్రా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ స్నేహితులతో కలిసి బర్త్ డే పార్టీలో చిలౌట్ అవుతోన్న వీడియోని ఇన్ స్టాలో షేర్ చేసి కాకలు రేపుతోంది. ఓ భారీ షిప్ లోకే కార్ ని పోనిచ్చిది. పోష్ ఎంట్రీతో మతులు చెడగొట్టింది. ఆ కార్ లో ఫుల్ గా స్నేహితురాళ్లతో నిండిపోయింది.

షిప్ లో ఎంజాయ్ చేసి అటుపై రిసార్ట్స్ లో చిల్ అవ్వడానికి దిగారు. అంతా రిసార్స్ట్ లో మద్యం తాగుతూ మత్తులో తేలారు. ఆపై పూల్ లో బికీనిలతో సెగలు పుట్టించారు. అమైరాతో పాటు తన స్నేహితురాళ్లు అదే స్థాయిలో చెలరేగిపోయారు. మిడ్ నైట్ లో పూల్ సైడ్ ట్రీట్ ని ఏమాత్రం వదిలి పెట్టలేదు. చీకట్లోనూ ఈత కోలనులో ఈదుతూ తడిసిన అందాలతో వేడి పుట్టించారు. ఆపై కేక్ కట్ చేసి పార్టీని ముగించి చివరికి ట్రిప్ నుంచి బయటపడ్డారు. అందుకు సంబంధించిన వీడియో అంతర్జాలంలో వైరల్ గా మారింది.

తెలుగులో మళ్లీ ఎప్పుడు?

అమైరా కొంత గ్యాప్ తర్వాత దస్తూర్ రాజుగాడు అనే చిత్రంలో నటించింది. కానీ అది కూడా హిట్ కాలేదు. బాలీవుడ్ లో కోయి జానే నా – మేడ్ ఇన్ చైనా చిత్రాల్లోనూ అమైరా నటించింది. ప్రస్తుతం సౌత్ లో భగీరాలో నటిస్తోంది. ఇందులో ప్రభుదేవా కథానాయకుడు.ఇంతకుముందు రిలీజైన `భగీరా` టీజర్ ఆకట్టుకుంది. ఈ చిత్రంలో ప్రభుదేవా ఏకంగా ఐదారు గెటప్ లతో సర్ ప్రైజ్ చేయబోతున్నారు. లవర్ బోయ్ కం సైకోగా అతడి నటవిన్యాసాలు పీక్స్ లో చూపించబోతున్నారు. ఈ చిత్రంలో అమైరా దస్తూర్ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉందని తెలిసింది. అమైరా దస్తూర్ – రమ్య నంబీసన్- జనని అయ్యర్- సాంచిత శెట్టి- గాయత్రి శంకర్- సాక్షి అగర్వాల్ లాంటి భామలు నటించారు. 7/ జి బృందావన కాలనీ ఫేం సోనియా అగర్వాల్ కీలక పాత్రలో నటిస్తోంది. అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఈ సినిమా తో తెలుగు-తమిళ ఆడియెన్ ని మెప్పించి ఇక్కడ వరుస చిత్రాలు చేయాలని అమైరా కలలు గంటోంది. కానీ ఆశించిన బ్రేక్ వస్తుందో లేదో వేచి చూడాలి.