ఘోస్ట్ కు నో చెప్పి టీచర్ కి ఒకే

అమలా పాల్ హీరోయిన్ గా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తుంది. కాని తెలుగు లో మాత్రం ఒక్క సినిమాను కూడా చేయడం లేదు. పెళ్లి తర్వాత ఈమెకు ఆఫర్లు టాలీవుడ్ లో తగ్గాయి. భర్తకు విడాకులు ఇచ్చి మళ్లీ సినీ కెరీర్ ను ప్రారంభించిన సమయంలో టాలీవుడ్ లో ఈ అమ్మడు ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేసింది కాని వర్కౌట్ అవ్వలేదు. చిన్న చిన్న ఆఫర్లు వచ్చినా కూడా ఆ మద్య కాదన్నట్లుగా ప్రచారం జరిగింది.

ఇటీవలే నాగార్జున నటిస్తున్న ఘోస్ట్ సినిమా కోసం దర్శకుడు ప్రవీణ్ సత్తారు ఈమెను సంప్రదించాడట. కాజల్ స్థానంలో ఆమెను తీసుకునేందుకు చర్చలు జరిపారు. ఆ సినిమాలో నటించేందుకు ఓకే అన్నప్పటికి భారీ పారితోషికంను డిమాండ్ చేసిందట. దాంతో మరో హీరోయిన్ వైపు ఘోస్ట్ మేకర్స్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో మలయాళంలో ఒక సినిమాను అమలా పాల్ చేస్తోంది. టీచర్ అనే టైటిల్ తో ఈ సినిమా రూపొందుతోంది.

ఫాహద్ ఫాజిల్.. సాయి పల్లవి తో విభిన్నమైన చిత్రం అథిరన్ ను తెరకెక్కించిన దర్శకుడు వివేక్ దర్శకత్వంలో ఈ టీచర్ చిత్రం రూపొందుతుంది. తాజాగా షూటింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సొంత భాష మలయాళంలో చాలా కాలం తర్వాత ఒక సినిమాను చేస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు షురూ అయిన నేపథ్యంలో తెలుగు లో ఈమె ఎందుకు నటించడం లేదనే టాక్ వినిపిస్తుంది.

తమిళం మరియు మలయాళం సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈమె ముందు ముందు తెలుగు లో కూడా నటించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆ మద్య ఒక తెలుగు వెబ్ సిరీస్ లో నటించింది కాని తెలుగు సినిమాకు మాత్రం ఓకే చెప్పడం లేదు. ఏదైనా సినిమా వస్తే భారీ పారితోషికం ను డిమాండ్ చేస్తుంది. ఈమె సినిమాల ఎంపిక విషయం విడ్డూరంగా ఉందంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

తెలుగు లో రామ్ చరణ్ మరియు అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో నటించడం వల్ల టాలీవుడ్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. యంగ్ స్టార్ హీరోలతో నటించిన తాను మళ్లీ స్టార్స్ తో నటించడం కోసం ఎదురు చూస్తుందేమో అందుకే సీనియర్ స్టార్ అయిన నాగార్జునతో నటించేందుకు ఆమె ఆసక్తిగా లేదేమో అంటూ మీడియా వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మళ్లీ యంగ్ హీరోలతో ఈ అమ్మడికి ఛాన్స్ రావాలంటే అది సాధ్యం అయ్యే విషయం కాదని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.