అంబానీలతో ఉన్న ఫొటోను షేర్‌ చేసి ఎమోషనల్‌ అయిన రిషి కపూర్‌ భార్య

బాలీవుడ్‌ స్టార్‌ లెజెండ్రీ నటుడు రిషి కపూర్‌ ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన మరణంతో బాలీవుడ్‌ మొత్తం తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. అలాగే ఇండియన్‌ దిగ్గజ వ్యాపారవేత్త అయిన ముఖేష్‌ అంబానీ మరియు ఆయన కుటుంబ సభ్యులు కూడా రిషి కపూర్‌ మరణంపై స్పందిస్తూ తమ సంతాపంను తెలియజేశారు. రిషి కపూర్‌ కుటుంబ సభ్యులకు అంబానీ కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిజేయడం జరిగింది.

తాజాగా రిషి కపూర్‌ భార్య నీతూ కపూర్‌ సోషల్‌ మీడియాలో ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీతో ఉన్న ఫొటోను షేర్‌ చేసింది. తాము ఆపదలో ఉన్న సమయంలో దు:ఖంలో ఉన్న సమయంలో అంబానీ ఫ్యామిలీ మాకు చాలా ధైర్యంగా నిలిచారు. వారి సాయంను ఎప్పటికి మర్చిపోలేను. గత రెండు సంవత్సరాలుగా మేము చాలా గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నాం. ఆ సమయంలో మాకు మద్దతుగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ పోస్ట్‌ చేసింది.

మా కుటుంబంకు ధైర్యంను కలిగించడంలో మరియు మమ్ములను ప్రోత్సహించడంలో అంబానీ ఫ్యామిలీ చూపించిన ప్రేమ వెలకట్టలేనిది. అన్ని విధాలుగా మమ్ములను జాగ్రత్తగా చూసుకుంటూ మాకు చాలా ధైర్యంగా నిలిచారు. ప్రతి ఒక్కరికి ఇలాంటి అండదండలు కష్టకాలంలో అందాలి. అప్పుడు ఎవరు కూడా నిరాశాకు గురి కాకుండా ఉంటారంది. ఆ సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు అంటూ నీతూ కపూర్‌ ఎమోషనల్‌ అయ్యింది.