పుష్ప ది రూల్ లో మెయిన్ విలన్ అనసూయ?

పుష్ప ది రైజ్ భారీ విజయం సాధించడంతో రెండో పార్ట్ పై సాధారణంగానే అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ఈ విజయాన్ని ఆస్వాదించిన సుకుమార్ ప్రస్తుతం రెండో పార్ట్ స్క్రిప్ట్ ను పూర్తి చేసే పనిలో పడ్డాడు. మొదటి పార్ట్ ను అల్లు అర్జున్ – ఫహద్ ఫాజిల్ మధ్య చిచ్చు పెట్టి ముగించిన సుకుమార్, సెకండ్ పార్ట్ లో వీరిద్దరి మధ్య యుద్ధం మెయిన్ కాన్ఫ్లిక్ట్ పాయింట్ గా నడిపిస్తాడని అందరూ ఆశించారు.

అయితే సుకుమార్ మరోసారి అంచనాలకు భిన్నంగా నడుచుకుంటున్నట్లు తెలుస్తోంది. పుష్ప ది రూల్ లో అల్లు అర్జున్ – ఫహద్ ఫాజిల్ మధ్య సన్నివేశాలు కీ పాయింట్ అయినా కూడా అనసూయ పోషించిన ద్రాక్షాయని పాత్ర మెయిన్ విలన్ గా వ్యవహరిస్తుందిట.

మొదటి భాగంలో ఎక్కువగా అండర్ ప్లే చేసిన ఈ పాత్ర, సెకండ్ పార్ట్ లో లీడ్ తీసుకుంటుందని సమాచారం.