ఔను యాంకర్‌ శ్యామల షర్మిల పార్టీలో చేరబోతున్నారు

ఏపీలో గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైఎస్‌ జగన్‌ కు మద్దతుగా యాంకర్‌ శ్యామల మరియు ఆమె భర్తలు ప్రచారం చేయడం జరిగింది. ఆ సమయంలో జగన్‌ ను కలిసి పార్టీ కండువ కూడా వేయించుకున్నారు. ఎన్నికల తర్వాత శ్యామల పెద్దగా రాజకీయాల్లో కనిపించలేదు. మళ్లీ వారం రోజుల క్రితం శ్యామల మరియు ఆమె భర్త బ్రదర్‌ అనీల్‌ ను కలవడం జరిగింది. ఆ సమయంలోనే రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. బ్రదర్‌ అనీల్‌ భార్య షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. అందుకే ఆమె పార్టీలో జాయిన్‌ అయ్యే ఉద్దేశ్యంతో షర్మిల భర్తను కలిశారా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి.

అనుమానాలు నిజం అనిపించేలా యాంకర్‌ శ్యామల మరియు ఆమె భర్త మరోసారి షర్మిలను లోటస్‌ పాండ్ లో కలవడం జరిగింది. బ్రదర్‌ అనీల్ ను కలిసిన సమయంలో వచ్చిన అనుమానాలు తాజాగా షర్మిలను కలవడంతో క్లారిటీ వచ్చేసింది. శ్యామల మరియు ఆమె భర్త తెలంగాణలో షర్మిల ఏర్పాటు చేయబోతున్న పార్టీలో జాయిన్ కాబోతున్నట్లుగా తేలిపోయింది. షర్మిల పార్టీ ప్రకటన సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో జిల్లాలకు చెందిన వారితో వివిధ వర్గాల వారితో వరుసగా చర్చలు జరుపుతున్నారు. ఈ సమయంలో శ్యామల భర్తతో కలిసి షర్మిలను కలిసి తమ మద్దతును తెలియజేశారు. వైకాపాను వీడి షర్మిల పార్టీలో జాయిన్‌ అయ్యేందుకు వారు సిద్దం అయ్యారు.