ఆఫర్‌ ఇస్తే పడుకుంటావా అని అడిగారు

బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్ సింగ్‌ రాజ్‌ పూత్‌ మొదటి ప్రేయసి అంకితా లోఖండే తాజాగా మీడియాలో చెప్పిన విషయం చర్చనీయాంశంగా మారింది. అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న తాను ఒకసారి ఒక సౌత్‌ ఇండియన్ సినీ హీరోను కలిశాను. ఆ హీరో అవకాశం ఇచ్చేందుకు సరే అన్నాడు కాని అందుకోసం కండీషన్స్‌ పెట్టాడు. కమిట్‌మెంట్‌ ఇవ్వాలని దేనికి అయినా కాంప్రమైజ్ అవ్వాలంటూ ముందే చెప్పాడు. దాంతో నేను ఆ ఆఫర్ ను తిరష్కరించాను అంటూ అంకితా చెప్పుకొచ్చింది.

సినిమా ఇండస్ట్రీలో నెలకొని ఉన్న ఈ పరిస్థితులు ఒకప్పుడు కొత్త వారికి చాలా ఇబ్బందిగా ఉండేవని కాని ఇప్పుడు వాటి ప్రభావం తగ్గినట్లుగా ఆమె చెప్పుకొచ్చింది. మీటూ వల్ల కొందరు భయపడుతున్నారు. కమిట్‌ మెంట్‌ అడిగేందుకు కూడా చాలా మంది సాహసం చేయడం లేదు. మీటూ వల్ల కొత్త వారికి చాలా ప్రయోజనం దక్కిందని ఆమె అభిప్రాయం వ్యక్తం చేసింది. సౌత్‌ నుండి తనకు ఆఫర్‌ ఇస్తానని కమిట్‌మెంట్‌ అడిగిన ఆ హీరో ఎవరు అనే విషయాన్ని మాత్రం అంకితా వెళ్లడించేందుకు ఆసక్తి చూపించలేదు.