మహా సముద్రంలో చేరిన మరో భామ

ఆరెక్స్ 100తో సంచలనమే సృష్టించాడు దర్శకుడు అజయ్ భూపతి. చాలా ఇంటెన్స్ కథను అంతే ఇంటెన్సిటీతో చెప్పి మొదటి సినిమాతోనే అందరి ప్రశంసలు అందుకున్నాడు. మొదటి సినిమా భారీ విజయం సాధించినా కానీ రెండో సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది.

మహా సముద్రం అనే యాక్షన్ డ్రామాను రాసుకున్నాడు అజయ్ భూపతి. అయితే ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి దాదాపు రెండేళ్ల సమయం పట్టింది. చాలా మంది హీరోలను అనుకుని చివరికి శర్వానంద్ వద్ద ఆగాడు దర్శకుడు అజయ్ భూపతి. మహా సముద్రంలో శర్వానంద్ తో పాటు సిద్ధార్థ్ కూడా లీడ్ రోల్ లో నటిస్తున్నాడు.

ఇక లాస్ట్ వీక్ మహా సముద్రంలో మొదటి హీరోయిన్ గా అదితి రావు హైదరి పేరును అనౌన్స్ చేసిన సంగతి తెల్సిందే. ఈరోజు ఈ చిత్రంలో రెండో హీరోయిన్ పేరును కూడా అనౌన్స్ చేసారు. నా పేరు సూర్య, సవ్యసాచి వంటి సినిమాల్లో నటించిన అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైంది. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. త్వరలోనే మహా సముద్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది.