చెప్పనంటూనే రిచాకు క్షమాపణ చెప్పిన పాయల్‌

సౌత్ లో పలు సినిమాల్లో నటించిన పాయల్‌ ఘోష్‌ ఇటీవల బాలీవుడ్‌ స్టార్‌ ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ పై మీటూ ఆరోపణలు చేసిన విషయం తెల్సిందే. ఆ సమయంలో ఆమె రిచా చద్దా పేరును ప్రస్థావించింది. అనురాగ్‌ కశ్యప్‌ తనకు రిచా చద్దా తో సన్నిహిత సంబంధం ఉందని అంటూ అన్నాడని పాయల్‌ ఘోష్‌ చేసిన వ్యాఖ్యలు మీడియాలో వైరల్‌ అయ్యాయి.

దాంతో అనురాగ్‌ కశ్యఫ్‌ మరియు రిచా చద్దాల మద్య ఉన్నది ఏంటీ అంటూ సోషల్‌ మీడియాలో చాలా మంది ప్రశ్నించారు. ఈ విషయమై రిచా స్పందించింది. తన పేరును తీసుకు వచ్చినందుకు గాను పాయల్‌ పై పరువు నష్టం దావాను రిచా వేసింది. ముంబయి కోర్టులో ఆమె వేసిన పిటీషన్‌ విచారణ జరిగింది.

కోర్టులో విచారణ సందర్బంగా మొదట తాను క్షమాపణ చెప్పందుకు ఓకే చెప్పింది. ఆ తర్వాత తాను ఉన్నమాటే అన్నాను. ఇందులో తన తప్పు ఏమీ లేదు. ఆమెకు క్షమాపణ అవసరం లేదు అంటూ పాయల్‌ పేర్కొంది. ఆ మాట అని కొన్ని గంటలు కూడా కాకుండానే మాట మార్చి కోర్టులో పరువు నష్టం కేసులో రిచాకు క్షమాపణ చెప్పేందుకు ఓకే చెప్పింది.

తాను ఉద్దేశ్య పూర్వకంగా ఆమె పేరు ఎత్తలేదు. ఆమె అంటే నాకు అభిమానమే. ఆమెను కించపర్చాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కనుక ఆమె నన్ను క్షమించాలంటూ కోర్టులో సారి చెప్పింది. కోర్టు పాయల్‌ క్షమాపణను స్వీకరిస్తారా అంటూ రిచా ను ప్రశ్నించగా అందుకు రిచా ఓకే చెప్పింది. దాంతో ఈ కేసు క్లోజ్‌ అయినట్లయ్యింది.