ఎక్స్ క్లూజివ్: ‘నిశబ్దం’ తర్వాత అనుష్క ప్లానింగ్‌ చేంజ్‌

బాహుబలి సినిమా తర్వాత అనుష్క లేడీ ఓరియంటెడ్‌ సినిమాలకు ఆసక్తి చూపిస్తూ వచ్చింది. బాహుబలి సమయంలో ‘సైజ్‌ జీరో’ సినిమాను చేసిన అనుష్క ఆ తర్వాత భాగమతి సినిమాను చేసింది. ఆ రెండు సినిమాలు కమర్షియల్‌ గా నిరాశ పర్చినా కూడా మరో ప్రయత్నం అన్నట్లుగా ‘నిశబ్దం’ సినిమాను చేసింది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వచ్చిన నిశబ్దం సినిమా కూడా నిరాశ పర్చింది. అనుష్క ఏమాత్రం ఆ సినిమాతో ఆకట్టుకోలేక పోయింది. అనుష్కను ఇంకా ప్రేక్షకులు కమర్షియల్‌ పాత్రలో కోరుకుంటున్నారని నిశబ్దం ఫలితంతో వెళ్లడి అయ్యింది.

నిశబ్దం సినిమా విడుదల కాకముందే ‘రారా కృష్ణయ్య’ అనే సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన మహేష్‌ దర్శకత్వంలో అనుష్క ఒక లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యింది. యూవీ క్రియేషన్స్‌ వారి ఆధ్వర్యంలో ఆ సినిమాకు సంబంధించిన స్ర్కిప్ట్‌ వర్క్‌ కూడా జరుగుతుంది. కాని నిశబ్దం ఫలితం తర్వాత ఆమె సినిమాకు నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి ఆ సినిమాను పక్కకు పెట్టి ఒక కమర్షియల్‌ సినిమాను చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి నిశబ్దం సినిమా ఫలితం అనుష్కలో చాలా పెద్ద మార్పు తీసుకు వచ్చింది అంటూ అభిమానులు కామెంట్స్‌ చేస్తున్నారు.

అనుష్క ఒక ప్రముఖ హీరోకు జోడీగా నటించేందుకు ఇటీవల ఓకే చెప్పిందని అనుష్క నటించబోతున్న ఒక రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమా ఇది అంటూ సమాచారం అందుతోంది. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. ఇది లేడీ ఓరియంటెడ్‌ మూవీ కాదు. ఇది పూర్తిగా హీరో సెంట్రిక్‌ గా సాగే కథతో సాగే కమర్షియల్‌ మూవీ అంటున్నారు. తమిళంలో రూపొందబోతున్న ఈ సినిమాను తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో అనుష్క మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.