నా హృదయానికి చేరువైన ఫొటో ఇది

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క ట్విట్టర్‌ లో జాయిన్‌ అయ్యింది. గత పదేళ్లుగా అనుష్క పేరుతో ఒక అకౌంట్‌ ఉంది. దాన్ని ఇప్పుడు అఫిషియల్‌ ట్విట్టర్‌ పేజీ అంటూ అనుష్క ప్రకటించింది. దాని నుండి రెగ్యులర్‌ గా ట్వీట్స్‌ వస్తాయంటూ ప్రకటించింది. ఈ ట్విట్టర్ అకౌంట్‌ కు వెరిఫికేషన్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలోనే ట్విట్టర్‌ నుండి వెరిఫికేషన్‌ వచ్చే అవకాశం ఉంది. ట్విట్టర్‌ లో అడుగు పెట్టిన అతి కొద్ది రోజుల్లోనే మిలియన్‌ ఫాలోవర్స్‌ ను దక్కించుకున్న అనుష్క తాజాగా అభిమానులతో లైవ్‌ చాట్‌ చేసింది.

నిశబ్దం సినిమా ప్రమోషన్‌ లో భాగంగా అనుష్క ట్విట్టర్‌ లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అభిమానులు అడిగిన ఎన్నో ప్రశ్నలకు అనుష్క చాలా ఓపికగా సింపుల్‌ అండ్‌ స్వీట్‌ గా సమాధానం చెప్పింది. తదుపరి సినిమాల విషయమై కూడా స్పష్టత ఇచ్చింది. ఒక అభిమాని కొత్త సినిమాల గురించి ప్రశ్నించిన సమయంలో ఈసారి ఆలస్యం కావు.. ఫైనల్‌ అయిన వెంటనే నిర్మాణ సంస్థలు ప్రకటిస్తాయంటూ అనుష్క పేర్కొంది. దక్షిణాదితో పాటు ఎక్కడైనా నటించేందుకు నేను సిద్దంగా ఉన్నాను అంటూ మరో ప్రశ్నకు సమాధానం చెప్పింది. నిశబ్దం సినిమా కోసం హైదరాబాద్‌ లో రమ్య మరియు టీం ట్రైనింగ్‌ తీసుకున్నాను. ఆ తర్వాత అమెరికాలోని ఒలివియా డంక్లే అనే అమెరికన్‌ వద్ద సైన్‌ లాంగ్వేజ్‌ నేర్చుకున్నాను అంది.

ఒక అభిమాని మిర్చి సినిమా సందర్బంగా తీసిన అనుష్క మరియు ప్రభాస్‌ ఫొటోను షేర్‌ చేసి ఈ ఫొటో గురించి ఒక్క మాట చెప్పండి అంటూ ప్రశ్నించాడు. అందుకు అనుష్క స్పందిస్తూ.. మేమిద్దరం కూడా సీన్‌ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆ సమయంలో తెలియకుండా తీసిన ఫొటో ఇది. ఇది అందరికి నచ్చడంతో పోస్టర్‌ గా బయటకు వచ్చింది. నా హృదయానికి చాలా దగ్గరగా ఉండే ఫొటో ఇది. యూవీ క్రియేషన్స్‌ లో నేను చేసిన మొదటి సినిమా ఫొటో అవ్వడం వల్ల కూడా ఈ ఫొటో ప్రత్యేకం అంటూ అనుష్క ఆసక్తికర సమాధానం ఇచ్చింది.