యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకి కరోనా పాజిటివ్.!

కరోనా మహమ్మారి రోజు రోజుకీ దేశవ్యాప్తంగా విజంభిస్తోన్న సంగతి అందరికీ తెలిసిందే. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వారు కరోనా బారిన పడడం అనివార్యం అవుతోంది. ఇటీవలే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ అండ్ ఫ్యామిలీకి కరోనా పాజిటివ్ రావడంతో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అంతే కాకుండా పలువురు తారలు కరోనా బారిన పడుతున్నారు.

తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు అయినా ఐశ్వర్య అర్జున్ కు కరోన పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. లక్షణాలు తెలియడంతో టెస్ట్ చేసుకోగా కరోనా అని తేలింది. దాంతో ప్రస్తుతం ఆమె చెన్నైలో ప్రముఖ డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. త్వరలోనే ఆమె కోవిడ్ 19 నుంచి కోలుకుని మళ్ళీ నార్మల్ అవ్వాలని కోరుకుంటున్నాం. ఇటీవలే అర్జున్ తెలుగులో తనని హీరోయిన్ గా లాంచ్ చేస్తూ సినిమా చేయాలని కూడా నిర్ణయం తీకున్నారు. ఇంతలో లాక్ డౌన్ రావడంతో అది ఆగింది.