బాలయ్య ఈసారి మాత్రం అస్సలు తగ్గనంటున్నాడు

నందమూరి బాలకృష్ణ డ్రీమ్ ప్రాజెక్ట్ నర్తనశాల. 2002లోనే ఈ సినిమాను ప్రారంభించాడు బాలయ్య. తాను అర్జునుడిగా, సౌందర్య ద్రౌపది పాత్రలో, శరత్ బాబు, శ్రీహరి ఇతర కీలక పాత్రల్లో మొదలుపెట్టిన నర్తనశాల కొద్ది రోజులు షూటింగ్ చేయడంతోనే ఆగిపోయింది. అయితే ఇన్నేళ్ల తర్వాత ఎందుకనో బాలయ్య ఆ చిత్ర ఫుటేజ్ ను బయటకు తెచ్చాడు. అప్పటికి షూట్ చేసిన భాగం కొంత, స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్ట్ కొంత జతచేసి దసరా సందర్భంగా ఒక చిన్న ఫుటేజ్ ను ఓటిటి మాధ్యమంలో వదిలాడు.

అయితే దీనికి నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. నిజానికి ఈ ఫుటేజ్ లో విషయం లేదు. కేవలం పబ్లిసిటీ స్టంట్ లా అనిపించింది అంటూ బాలకృష్ణపై విమర్శలు చేసారు నెటిజన్లు. అయితే బాలయ్య ఈ స్ట్రాటజీ వెనుక పెద్ద కథే ఉంది.

బాలకృష్ణకు ఇప్పటికీ ఈ సినిమాను తెరకెక్కించాలని ఉంది. అందుకోసమే జనాల్లో ఆసక్తి కోసం ఆ ఫుటేజ్ ను వెలికితీయించి విడుదల చేసాడు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మరోసారి నర్తనశాల ప్రయత్నాలు బాలకృష్ణ మొదలుపెట్టాడట. ఇందుకు తగిన నటీనటుల వేటను ఇప్పటికే ప్రారంభించినట్లు తెలుస్తోంది.

వచ్చే సంక్రాంతి లోగా ఈ సినిమాకు సంబంధించిన ఏదొక ప్రకటన ఉండవచ్చని అంటున్నారు. మరొక విషయం ఏమిటంటే బాలకృష్ణ ఈ సినిమాను తాను తెరకెక్కించడంతో పాటు మరొక సీనియర్ దర్శకుడి సహాయం కూడా తీసుకుంటాడని తెలుస్తోంది.