దివంగత లెజెండ్రీ సింగర్‌ బాలు పాత్రలో మెగాస్టార్‌

కరోనా కాటుతో గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మృతి చెందిన విషయం తెల్సిందే. ఆయన ఈ లోకాన్ని వదిలి వెళ్లినా కూడా ఆయన సినిమాలు మరియు పాటలు మాత్రం ఎప్పటికి నిలిచి పోతాయి అనడంలో సందేహం లేదు. గాయకుడిగానే కాకుండా ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించారు. మిథునం వంటి విభిన్నమైన సినిమాలో ఆయన నటించారు. ఆ సినిమాలో లక్ష్మితో కలిసి బాలు గారు నటించారు. తనికెళ్ల భరణి దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా ఎప్పటికి నిలిచి పోతుంది అనడంలో సందేహం లేదు. ఇప్పుడు ఆ సినిమాను హిందీలో రీమేక్‌ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది.

బాలు పోషించిన పాత్రను బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబచ్చన్‌ పోషించేందుకు రెడీగా ఉన్నాడట. ఇదే సమయంలో ఆయన లక్ష్మి పాత్రను జయా బచ్చన్‌ పోషించే అవకాశం కనిపిస్తుంది. నిజ జీవిత జీవిత భాగస్వాములు అయిన వీరిద్దరు మిథునం రీమేక్‌ లో నటించబోతున్నారనే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ సమయంలో సౌత్‌ సినిమాల రీమేక్‌ హిందీలో ఎక్కువ అయ్యాయి. వాటి దారిలోనే మెగాస్టార్ మిథునం రీమేక్‌ ను చేసేందుకు సిద్దం అయ్యాడు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మిథునం రీమేక్‌ లో బచ్చన్‌ కు జోడీగా రేఖ నటించే అవకాశాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి. కాని అది ఆచారణ సాధ్యం కాదని చాలా మంది బలంగా నమ్ముతున్నారు.