బిగ్ బాస్ 4: ఎపిసోడ్ 51 – మరోసారి రసవత్తరంగా సాగిన ఎలిమినేషన్‌ నామినేషన్‌

తెలుగు బిగ్‌బాస్‌ ఏడు వారాలు ముగించుకుని ఎనిమిదవ వారంలోకి అడుగు పెట్టింది. నిన్నటి ఎపిసోడ్‌లో ఎప్పటిలాగే ఎలిమినేషన్‌ కు నామినేషన్‌ పక్రియ కొనసాగింది. ఇంటి సభ్యుల ఫొటోలను పగుల కొడుతూ ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుంది. నామినేషన్‌ పక్రియ అనగానే అందరు కూడా ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు. అంతా ఎదురు చూసినట్లుగానే నిన్నటి ఎపిసోడ్‌ కూడా మళ్లీ చాలా రసవత్తరంగా సాగింది అనడంలో సందేహం లేదు. ఎలిమినేషన్‌ నామినేషన్‌ పక్రియలో భాగంగా మొదట లాస్య పక్రియ ప్రారంభించింది.

లాస్య మొదటగా తన నవ్వును ఫేక్‌ అంటూ బాధపెట్టాడు అని అమ్మ రాజశేఖర్‌ ను నామినేట్‌ చేసింది. ఆ తర్వాత మోనాల్‌ విషయంలో తనకు ఉన్న కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వల్ల ఆమెను నామినేట్‌ చేస్తున్నట్లుగా చెప్పింది. ఆ తర్వాత అఖిల్‌ వెళ్లి అరియానా మరియు అమ్మ రాజశేఖర్‌ లను నామినేట్‌ చేశాడు. అరియానా కోపంతో ఊగిపోతుంది, ఎప్పుడు అవతలి వారి మాటలను వినడం లేదు అంటూ అఖిల్‌ అన్నాడు. అదే సమయంలో అమ్మ రాజశేఖర్‌ తనను సింపతీ గేమ్‌ ఆడుతున్నావు అన్నాడు. అందుకే నాకు బాధ కలిగింది. మెహబూబ్‌ వెళ్లి అరియానా మరియు మోనాల్‌ ల ఫొటోలను పగులకొట్టి నామినేట్‌ చేస్తున్నట్లుగా ప్రకటించాడు.

అవినాష్‌ తన వంతు వచ్చిన సమయంలో లాస్య మరియు హారికలను నామినేట్‌ చేశాడు. లాస్య తనకు టీ పెట్టి ఇవ్వమని రెండు మూడు సార్లు అడిగినా కూడా ఇవ్వలేదు అంటూ బాధ పడుతూ నామినేట్‌ చేశాడు. ఆ తర్వాత అమ్మ రాజశేఖర్‌ తాను అఖిల్‌ మరియు లాస్యలను నామినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొని వారి ఫొటోలను పగులకొట్టాడు. అరియానా తాను మెహబూబ్‌ మరియు అఖిల్‌ లను నామినేట్‌ చేస్తున్నట్లుగా పేర్కొంది. వీరిద్దరి పై కూడా ఆమె కాస్త సీరియస్‌ గానే ఫైర్‌ అయ్యింది. సోహెల్‌ కూడా అరియానా మరియు అమ్మ రాజశేఖర్‌ ను నామినేట్‌ చేశాడు.

ఇతడు చాలా సేఫ్‌ గా ఇద్దరిని నామినేట్‌ చేసి సారీ చెప్పాడు. నోయల్‌ మాత్రం తనకు ఆటలో చాలా ఠఫ్‌ అనుకున్న వారిని నామినేట్‌ చేస్తున్నట్లుగా చెప్పి మెహబూబ్‌ మరియు అఖిల్‌ లను నామినేట్‌ చేశాడు. అభిజిత్‌ వెళ్లి మోనాల్‌ మరియు అమ్మ రాజశేఖర్‌ లను నామినేట్‌ చేశాడు. హారిక వెళ్లి అరియానా మరియు మెహబూబ్‌ లను నామినేట్‌ చేసింది. చివరకు మోనాల్‌ గజ్జర్‌ తాను మెహబూబ్‌ మరియు లాస్యలను నామినేట్‌ చేస్తున్నట్లుగా చెప్పింది. దాంతో ఈ వారం ఎలిమినేషన్‌ అమ్మ రాజశేఖర్‌, అరియానా, మెహబూబ్‌, లాస్య, మోనాల్‌, అఖిల్‌లు నామినేట్‌ అయ్యారు.