చంద్రబాబుతో గోరంట్ల భేటీ..! అలకకు కారణాలపై చర్చ..!?

టీడీపీ అధిష్ఠానంపై ఇటీవల అలిగిన సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే, పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అధినేత చంద్రబాబుతో మంగళగరిగిలోని ఎన్టీఆర్‌ భవన్‌లో భేటీ అయ్యారు. పార్టీలోని పరిస్థితులపై చంద్రబాబుతో గోరంట్ల చర్చించినట్టు తెలుస్తోంది.

గోరంట్ల వెంట పార్టీ నేతలు చిన రాజప్ప, నల్లమిల్లి, గద్దె రామ్మోహన్‌, జవహర్‌ తదితరులు ఉన్నారు. ఈ భేటీలో గోరంట్ల అసంతృప్తికి కారణాలను చంద్రబాబు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గోరంట్ల అలక వహించిన నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం త్రిసభ్య కమిటీని నియమించి ఆయనతో రాయభారం పంపిన సంగతి తెలిసిందే. వారంతా బుచ్చయ్య చౌదరి నివాసానికి వెళ్లి సుమారు రెండున్నర గంటలపాటు చర్చలు జరిపారు.

ఆయన అభిప్రాయాలు, మనోభావాలు తెలుసుకుని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలోనే చంద్రబాబుతో గోరంట్ల సమావేశమయ్యారు.