మెగా నందమూరి ఫ్యాన్స్‌ ఎదురు చూపులు

కరోనా కారణంగా మార్చిలో ఆగిపోయిన షూటింగ్స్‌ మళ్లీ ఈమద్యే మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. యంగ్‌ హీరోలు ఇప్పటికే తమ తమ సినిమాలతో బిజీ అయ్యారు. షూటింగ్స్‌ తో హడా వుడి అయ్యారు. అయితే సీనియర్‌ హీరోలు అయిన చిరంజీవి మరియు బాలకృష్ణ వంటి స్టార్‌ హీరోలు మాత్రం ఇంకా సెట్స్‌ పైకి వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆరు పదుల వయసు దాటిన కారణంగా ఆ ఇద్దరు హీరోల షూటింగ్స్‌ విషయంలో వెనుకంజ వేస్తున్నారు. యంగ్‌ స్టర్స్‌ కరోనా వల్ల ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం లేదు. వయసు పై బడిన వారు కరోనా సోకితే ప్రాణాలకే ప్రమాదం. కనుక ఈ ఏడాది చివరి వరకు సీనియర్‌ హీరోలు వెయిట్‌ చేయాలని భావిస్తున్నారట.

యంగ్‌ స్టార్‌ హీరోల మాదిరిగా కాకుండా కాస్త మెల్లగానే చిరంజీవి మరియు బాలయ్యలు షూటింగ్‌ మొదలు పెట్టాలనుకుంటున్నారు. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య సినిమాను బాలయ్య బోయపాటి దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలకు సంబంధించిన అప్‌ డేట్‌ కోసం ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇద్దరు సీనియర్‌ లు ప్రస్తుతం చేస్తున్న సినిమాలు ఫ్యాన్స్‌ లో మరియు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగి ఉన్నాయి. ముఖ్యంగా ఆచార్య సినిమా విషయంలో ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించడంతో పాటు రామ్‌ చరణ్‌ కూడా ఈ సినిమాలో నటించడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు బాలయ్య బోయపాటి దర్శకత్వంలో చేస్తున్న మూడవ సినిమా అవ్వడం వల్ల అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఇలాంటి రెండు భారీ ప్రాజెక్ట్‌ లు షూటింగ్‌ లు ప్రారంభం కాకపోవడంతో వారి వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.