మళ్లీ సస్పెన్స్‌లో పెట్టిన మెగాస్టార్‌

కొన్ని రోజుల క్రితం మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్‌లో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. అప్పటి నుండి కూడా ఆయన ట్విట్టర్‌లో ప్రతి రోజు కూత పెడుతూనే ఉన్నాడు. వరుసగా ట్వీట్స్‌ చేస్తూనే ఉన్నాడు. ఆయన ట్వీట్స్‌ కోసం ఫ్యాన్స్‌ ఎదురు చూసేలా చాలా ఇంట్రెస్టింగ్‌ ట్వీట్స్‌ చేస్తున్నాడు. ఆయన చేస్తున్న ట్వీట్స్‌ విషయంలో సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నాయి. ఇటీవల హనుమాన్‌ జయంతి రోజుకు తనకు ఉన్న అనుబంధంను తెలియజేసేందుకు వరుసగా సస్పెన్స్‌ ట్వీట్స్‌ చేశాడు.

ఆ రోజు చిరంజీవి ట్వీట్స్‌కు ఏ స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు మళ్లీ అదే తరహా సస్పెన్స్‌లో చిరంజీవి పెట్టాడు. తాజాగా చిరంజీవి ఒక ట్వీట్‌ను చేశాడు. ఆ ట్వీట్‌లో చిరంజీవి సాదారణంగా సినిమాలోని పాటను చిత్రీకరించే సమయంలో పాటను పాజ్‌ చేస్తూ పాజ్‌ చేస్తూ షూటింగ్‌ చేస్తాం. ఆ సమయంలో పూర్తి పాట వినాలనిపిస్తుంది. మళ్లీ మళ్లీ పాటను పాజ్‌ చేస్తూ వినడం చిరాకుగా అనిపిస్తుంది.

ఇప్పుడు ఒక పాటను మాత్రం నేను కావాలని పాజ్‌ చేస్తూ మళ్లీ మొదటి నుండి పదే పదే వింటున్నాను. ఎందుకు ఇంతకు ఆ పాట ఏంటీ అనేది మాత్రం నేను రేపు ఉదయం 9 గంటలకు చెప్తాను అంటూ సస్పెన్స్‌లో ఉంచాడు. ఆ పాట ఏమై ఉంటుందా అంటూ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. అది కొత్తదా లేదా పాతదా అనే విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వలేదు కాని కొందరు మాత్రం ఆయన ఉప్పెన సినిమా పాట గురించి చెబుతున్నట్లుగా అనిపిస్తుందని అంటున్నారు. మరి రేపటికి సినిమా ఏంటీ, పాట ఏంటీ అనేది క్లారిటీ వస్తుంది.