ఆ ఇద్దరి మ్యూజిక్ దిగ్గజాల్లో ప్రభాస్ 21 ఛాన్స్ ఎవరిని వరిస్తుంది?

‘బాహుబలి’ తర్వాత వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. కానీ ప్రభాస్ 21, అనగా వైజయంతి మూవీస్ బ్యానర్ లో చేస్తున్న సినిమా మాత్రం పాన్ వరల్డ్ అని ఈ చిత్ర డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఇప్పటికే ఖరారు చేశారు. ఈ పాన్ వరల్డ్ కి సరిపోయే రేంజ్ లో ఉండాలనే నాగ్ అశ్విన్ హీరోయిన్ గా దీపిక పడుకొనేని హీరోయిన్ గా ఖరారుకి చేశారు.

ఇదే తరహాలో ఈ చిత్ర నటీనటుల్ని మరియు టెక్నిషియన్స్ ని ఒక్కొక్కరిగా ఫైనల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంఎం కీరవాణిని తీసుకోనున్నారని ఇది వరకే వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం మ్యూజిక్ డైరెక్టర్ రేస్ లో ఏఆర్ రెహమాన్ కూడా చేరారట. ప్రస్తుతం కీరవాణి – రెహమాన్ మధ్య పోటీ నడుస్తోంది. త్వరలోనే ఈ ఇద్దరిలో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉంది. వీరిద్దరిలో ఏఆర్ రెహమాన్ కి ఇప్పటికే పాన్ వరల్డ్ గుర్తింపు ఉండగా, ఎంఎం కీరవాణికి బాహుబలితో కొంత గుర్తింపు వచ్చింది.

2021 సమ్మర్ నాటికి ఈ చిత్ర సినిమా షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉంది. దానికితగ్గట్టుగా అన్ని పనులను పూర్తి చేసేలా ప్లాన్ చేశారు. ఈ లోపుగా సినిమాలో నటించే వారిని, టెక్నిషియన్స్ ని ఒక్కొక్కరిగా పరిచయం చేసుకుంటూ రానున్నారు. సైన్ – ఫిక్షన్ కథతో రూపొందుతున్న ఈ సినిమాకి సాయి మాధవ్ బుఱ్ఱా మాటలు రాస్తున్నారు.