మూడో పార్ట్ గురించి హింట్ ఇచ్చిన దృశ్యం నిర్మాత

మలయాళంలో విడుదలైన మోహన్ లాల్ సినిమా దృశ్యం ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనందరికీ తెలుసు. 2013లో విడుదలైన ఈ సినిమా అన్ని భాషల ఇండస్ట్రీస్ ను ఆకర్షించింది. విడుదలైన అన్ని భాషల్లో కూడా ఈ సినిమా రీమేక్ సూపర్ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఏడేళ్ల తర్వాత దృశ్యం సినిమాకు సీక్వెల్ వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన ఈ సినిమా కూడా పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంది. దృశ్యం సినిమాకు పెర్ఫెక్ట్ సీక్వెల్ అని అందరూ అంటున్నారు. ఇక దృశ్యం చిత్రానికి మరో పార్ట్ కూడా ఉంటుందని అంటున్నారు.

దీనిపై దృశ్యం నిర్మాత ఆంథోనీ స్పందించారు. జీతూ జోసెఫ్ మైండ్ లో దృశ్యం 3 స్క్రిప్ట్ ఉంది. తనతో మాట్లాడినప్పుడు ఈ విషయం నాకు అర్ధమైంది. మోహన్ లాల్ సర్, జీతూ జోసెఫ్ ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకోవడం జరిగింది కూడా. అది నిజంగా జరగాలని నేను కూడా కోరుకుంటున్నా అని నిర్మాత తెలిపాడు.

ఇక దృశ్యం ఫ్యాన్స్ దీనిపై చాలా సంతోషంగా ఉన్నారు.