గాయ‌నితో సంగీత ద‌ర్శ‌కుడి స‌హ‌జీవ‌న రాగం

భార్యా పిల్ల‌ల్ని విడిచిపెట్టి…తొమ్మిదేళ్లుగా గాయ‌నితో సంగీత ద‌ర్శ‌కుడు గోపీ సుంద‌ర్ స‌హ‌జీవ‌నం సాగిస్తున్నాడు. ద‌క్షిణాది త‌న‌కంటూ సంగీత ద‌ర్శ‌కుడిగా గోపీ సుంద‌ర్ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సంగీత ప్రియుల‌కు ఇష్ట‌మైన వ్య‌క్తిగా ఆయ‌న సుప‌రిచితులే. ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’తో టాలీవుడ్‌లో మ్యూజిక్‌ కంపోజర్‌గా ప్ర‌వేశించిన‌ గోపీ ‘గీతా గోవిందం’ చిత్రంతో ప్రత్యేక గుర్తింపు పొందాడు.

గోపీ సుంద‌ర్ వ్యక్తిగ‌త జీవితం గురించి ఎవ‌రికీ తెలియ‌దు. ఆయ‌న సంగీతం గురించి మాత్ర‌మే కళాభిమానుల‌కు తెలుసు. తాజాగా గోపీ ఇన్‌స్టాలో షేర్‌ చేసిన‌ పోస్ట్‌తో అతడి వ్యక్తిగత జీవితంపై నెటిజ‌న్లు చ‌ర్చించుకునేలా చేస్తోంది. స‌హ‌జంగానే సినీ సెల‌బ్రిటీల వ్య‌క్తిగ‌త జీవితాల గురించి తెలుసుకోవాల‌నే ఆస‌క్తి ఉండ‌టం తెలిసిందే. ఇప్పుడు ఆ అవ‌కాశాన్ని గోపీనే నెటిజ‌న్ల‌కు ఇచ్చాడు.

దీంతో గోపీ వృత్తిగ‌త జీవితంపై నుంచి వ్య‌క్తిగ‌త జీవితంపై చ‌ర్చ మ‌ళ్లింది. 2001లో ప్రియ అనే యువ‌తిని గోపీ సుంద‌ర్ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్ద‌రు కుమారులు. భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య మ‌న‌స్ప‌ర్థ‌ల‌తో విడిగా ఉంటున్నారు. భార్య నుంచి విడాకులు కోరుతూ గోపీ కోర్టు మెట్లు ఎక్కాడు. భార్య ప్రియ కూడా విడాకులు ఇచ్చేందుకు సుముఖంగా ఉన్న‌ట్టు స‌మాచారం.

కాగా గోపీ జీవితంలో మ‌రో ట్విస్ట్ ఉంది. యువ గాయ‌ని అభ‌య హిర‌న్మ‌యితో క‌లిసి గోపీ నిజ జీవితంలో ప్రేమ గీతాలు ఆల‌పిస్తున్నాడు. ఇద్ద‌రి మ‌ధ్య శృతి క‌లిసింది. దీంతో ఇద్ద‌రూ తొమ్మిదేళ్లుగా స‌హ‌జీవ‌నం చేస్తూ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ అంటూ డ్యూయెట్లు పాడుకుంటున్నారు.

గోపీ త‌న ఇన్‌స్టాలో హిర‌న్మ‌యితో క‌లిసి దిగిన ఫొటో షేర్ చేస్తూ…‘నా ఉనికికి నువ్వే కారణం’ అంటూ పోస్ట్‌ చేశాడు. దీంతో గోపీ సుంద‌ర్ వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన విష‌యాల‌పై నెటిజ‌న్లు, అభిమానులు ఆరా తీయ‌సాగారు. ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. కాగా గోపీ సుందర్‌ స్వరపరిచిన అనేక పాటలను హిరన్మయి ఆలపించారు. స‌హ‌జీవ‌నంలోనూ ప‌ర‌స్ప‌రం అర్థం చేసుకుంటూ, ప్రేమే శ్వాస‌గా జీవితాన్ని పాట‌ల పూదోట‌గా మార్చుకోవాల‌ని ఆశిస్తూ…