మళ్లీ టైమ్ ట్రావెల్ కు సిద్దమవుతున్న స్టార్ హీరో

ఈమద్య కాలంలో టైమ్ ట్రావెల్ సినిమాలపై జనాల్లో ఆసక్తి కనిపిస్తోంది.. దాంతో మేకర్స్ కూడా టైమ్ ట్రావెల్ సినిమా లపై దృష్టి పెడుతున్నారు. ఎంతో మంది స్టార్ హీరోలు కూడా ఆ తరహా కథను సిద్దం చేయాల్సిందిగా తమ వద్దకు వస్తున్న దర్శకులకు సూచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ సమయంలోనే బాలకృష్ణ పాత టైమ్ ట్రావెల్ మూవీ ఆధిత్య 369 సినిమా కు సీక్వెల్ ను తీసుకు వచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ విషయంలో ఇప్పటి కే బాలయ్య అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది. అయితే అది కాస్త సమయం పడుతుందని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక ప్రభాస్ చేస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా కూడా టైమ్ ట్రావెల్ మూవీ అంటూ వార్తలు వస్తున్నాయి. ఇంకా ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇదే సమయంలో సూర్య హీరోగా వచ్చిన 24 సినిమా కు సీక్వెల్ రాబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. సూర్య హీరోగా నటించిన 24 లో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ ను చూశాం. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా వచ్చి ఆరు ఏళ్లు అవుతుంది. తాజాగా సూర్య ఒక ఇంటర్వ్యూలో 24 సినిమాకు సీక్వెల్ ను తీసుకు వచ్చే ఆలోచనలో ఉన్నట్లుగా ప్రకటించాడు.

అయితే కొత్త కథ కాకుండా ఆ సినిమాకు సంబంధించిన కథ కు కొనసాగింపుగానే సీక్వెల్ సినిమా ఉంటుందని అంటున్నారు. టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తోనే 24 సినిమా సీక్వెల్ కూడా ఉంటుందనే అభిప్రాయంతో అభిమానులు వెయిట్ చేస్తున్నారు. తాజాగా సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 24 సీక్వెల్ కథకు సంబంధించిన చర్చలు కొలిక్కి వచ్చాయి. స్టోరీ లైన్ సిద్దం అవ్వడంతో ప్రస్తుతం టీమ్ ఆ స్టోరీ లైన్ ను పూర్తి స్క్రిప్ట్ గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నే ఈ సీక్వెల్ ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా రూపొందుతున్న విషయం తెల్సిందే. థ్యాంక్యూ సినిమా తర్వాత 24 సినిమా సీక్వెల్ పని మొదలు పెట్టే అవకాశం ఉందని అంటున్నారు.