ఊ అంటావా అంటూ ఊపేస్తోన్న జాన్వీ!

`ఊ అంటావా మావ ఊఊ అంటావా` సాంగ్ ఏ రేంజ్ లో పాపులర్ అయ్యిందో చెప్పాల్సిన పనిలేదు. ఈ పాటపై సో షల్ మీడియా ఖాతాల్లో ట్రోలింగ్స్ ..మీమ్స్ ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. ఆ మాస్ మసాలా సాంగ్ కి ఎవరి మ్యాచ్ అయినా ట్రోలర్స్ వదిలిపెట్టలేదు. తాజాగా ఇప్పుడా వంతు బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ ది అయింది.

జాన్వీ పసుపు వర్ణం చీరలో కెమెరాకి ఫోజులిస్తోన్న వీడియో ఒకటి ఇన్ స్టాలో వైరల్ అవుతోంది. అందులో బ్యూటీ ఫోజులకి మ్యాచ్ చేస్తూ `ఊ అంటావా మావ ఊఊ అంటావా` సాంగ్ ని సింక్ చేసి వదిలారు నెటి జనులు. అసలే పసుపు చీర.. తెల్ల రైక..జాకెట్. ఇంకేముందు ఆవీడియో.. మావ పాట ఇన్ స్టాలో మరోసారి వైలర్ గా మారింది. జాన్వీ ఇన్ స్టా ఫాలోవర్స్ అంతా విజిల్స్ వేస్తూ ఆస్వాదించడం వంత్తైంది.

ఇక జాన్వీ లుక్ విషయానికి వస్తే పసుపు చీరలోనే జాన్వీ అందమంతా దాగి ఉందా? అన్నంతగా హైలైట్ అవుతుంది. పూల డిజైన్ తో కూడిన బ్లౌజు.. డెయింట్ లెస్ ఎంబ్రాయిడరీ పర్పెక్ట్ ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. వేలాడుతోన్న చెవిపోగులు..బ్లో అవుట్ హెయిర్ స్టైల్ తో జాన్వీ జివ్వు మనిపిస్తుంది. వివిధ భంగిమల్లో బ్యూటీ కెమెరాకి ఫోజులిచ్చింది. ఫేమస్ ఫ్యాషనిస్ట్ మనీష్ మల్హోత్రా ఈ డిజైన్ ని తీర్చిదిద్దారు.

ఇక జాన్వీ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్లో `దోస్తానా-2` లో నటిస్తోంది. అదే బ్యానర్ లో మరో రెండు చిత్రాలు కమిట్ అయింది. అలాగే అమ్మడు నటించిన `గుడ్ లక్ జెర్రీ` సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీగా ఉంది. `మిలీ` అనే మరో చిత్రంలో కూడా నటిస్తుంది. ఇక దక్షిణాదిన ఎంట్రీ ఇవ్వడానికి జాన్వీ ఆసక్తిగానే ఉంది. కానీ సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తుంది. తల్లి తరహాలోనే అన్ని భాషల్లోనూ సినిమాలు చేయాలని ప్రణాళికతో ముందుకు వెళ్తోంది.