సూపర్‌ హిట్‌కు సీక్వెల్‌ ప్రకటించిన డైరెక్టర్‌

మలయాళంలో సూపర్‌ హిట్‌ అయిన దృశ్యం చిత్రంను తెలుగు, తమిళం, హిందీల్లో కూడా రీమేక్‌ చేసిన విషయం తెల్సిందే. నాలుగు భాషల్లో కూడా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ను దక్కించుకున్నాయి. ఈ నాలుగు సినిమాలు కూడా అన్ని విధాలుగా విమర్శకుల ప్రశంసలు పొందాయి. అందుకే ఇప్పుడు దృశ్యంకు సీక్వెల్‌ చేసేందుకు దర్శకుడు జీతు జోషెష్‌ సిద్దం అయినట్లుగా తెలుస్తోంది. సీక్వెల్‌ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించాడు.

దృశ్యం చిత్రం 2014లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒరిజినల్‌ వర్షన్‌లో మోహన్‌లాల్‌, మీనాలు నటించారు. తెలుగులో వెంకటేష్‌, మీనాలు నటించారు, తమిళంలో కమల్‌ హాసన్‌, గౌతమిలు నటించారు. మోహన్‌లాల్‌, మీనాలతోనే సీక్వెల్‌కు స్క్రిప్ట్‌ రెడీ చేస్తున్నట్లుగా దర్శకుడు ప్రకటించాడు. ఒక వేళ మళ్లీ మలయాళంలో హిట్‌ అయితే వరుసగా తెలుగు, తమిళం, హిందీల్లో కూడా రీమేక్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు.

ఈసారి మరింత ఇంట్రెస్టింగ్‌ కంటెంట్‌తో దర్శకుడు జీతో జోషెష్‌ స్క్రిప్ట్‌ను రెడీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్న దృశ్యంను వచ్చే ఏడాది సెట్స్‌ పైకి తీసుకు వెళ్లే అవకాశం ఉందని అంటున్నారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే దృశ్యం 2 వచ్చే ఏడాది చివరి వరకు ప్రేక్షకుల ముందుకు రావచ్చు అంటున్నారు.