హీరోయిన్లపైనే మీ ప్రతాపాలా అనేసిన కియారా!

బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వాణీ- సిద్ధార్ధ్ మల్హోత్రా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ జంట పబ్లిక్ గా చాలాసార్లు మీడియాకి చిక్కారు. కానీ ఏ రోజూ తమ ప్రేమని అధికారికం చేయలేదు. కేవలం స్నేహితులు మాత్రమేనని..ప్రెండ్ షిప్ గానే కలిసి తిరుగుతున్నట్లు కవర్ చేసుకొచ్చారు.

అయితే ఓ రాత్రి సమయంలో కియారా నేరుగా కారు వేసుకుని సిద్ధార్ద్ ఇంటికి వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. అపార్ట్ మెంట్ కి వెళ్లగానే అక్కడ వృద్ధ సెక్యురిటీ గార్డ్ కియారా కారు గేట్ తీయడం.. సెల్యూట్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజనులు కియారాని తప్పుబట్టారు.

వయసులో పెద్దవాళ్లతో సెల్యూట్ చేయించుకోవడం ఏమిటో అంటూ మండిపడ్డారు. కియారా తలపొగరకు ఇది ఓ నిదర్వనం అంటూ నెటి జనులు కామెంట్లు చేసారు. తాజాగా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. నా స్థానంలో ఒక హీరో ఉంటే ఇలా ట్రోల్ చేస్తారా? ఆ వృద్ధుడిని సెల్యూట్ చేయమని ఎవరు అడిగారు? సెక్యూరిటీ కాబట్టి స్వతహగా ఆయన అలా చేసి ఉండొచ్చు. దానికి నన్ను ఆడిపోసుకోవడం దేనికి? కారులోంచి దిగుతుండగా ఫోటోగ్రాఫర్లు ఫోటోలు..వీడియోలు తీసి వైరల్ చేసారు. ఇది న్యాయమేనా? నేను ఏదైనా తప్పు కావాలని చేస్తే నిందించినా ఫర్వాలేదు.

కానీ అనవసరంగా ఇలాంటి ట్రోలింగ్ లు ఎంతవరకూ కరెక్టో మీరే ఆలోచించుకోండి? అని హితవు పలికింది. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో పలు ప్రాజెక్ట్ లతో బిజీగా ఉంది. ఇటీవలే `షేర్ షా` చిత్రంతో పెద్ద సక్సెస్ ఖాతాలో వేసుకుంది.