చరణ్ తో రెండోసారి టీమప్ అయిన హాట్ బ్యూటీ

కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను చిత్రం ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో వెంటనే రామ్ చరణ్ సరసన వినయ విధేయ రామ చిత్రంలో నటించే అవకాశం కలిగింది. అయితే ఆ సినిమా దారుణంగా పరాజయం పాలైంది.

అప్పటినుండి కియారా మరో తెలుగు సినిమా చేసింది లేదు. అయితే బాలీవుడ్ లో మాత్రం ఈ హాట్ భామ బాగానే పాగా వేసింది. వరసగా సూపర్ డూపర్ హిట్ చిత్రాలు చేజిక్కించుకుంటూ టాప్ స్థాయికి చాలా త్వరగా చేరుకుంది.

ప్రస్తుతం బాలీవుడ్ అత్యంత క్రేజ్ తో ఉన్న కియారా మళ్ళీ తెలుగులో రీఎంట్రీ ఇస్తోంది. రామ్ చరణ్ – శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న ప్యాన్ ఇండియా చిత్రంలో హీరోయిన్ గా కియారా కన్ఫర్మ్ అయింది. ఈ సందర్భంగా అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది. సెప్టెంబర్ నుండి ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే అవకాశముంది.