బ్రహ్మానందం మాదిరిగానే కాజల్‌ కూడా బుక్‌ అయ్యింది

హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తాజాగా కరోనా క్రైసిస్‌ ఛారిటీ మనకోసంకు మూడు లక్షల విరాళంను ఇచ్చిన విషయం తెల్సిందే. గతంలో ఒక్క రోజు అయిదు లక్షల పారితోషికం పొందిన స్టార్‌ కమెడియన్‌ వందల కోట్ల రూపాయల ఆస్తులున్న బ్రహ్మానందం కేవలం మూడు లక్షల విరాళం ఇవ్వడం ఏంటీ అంటూ విమర్శలు వ్యక్తం అయ్యాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు చేయక పోవచ్చు.. కాని ఆయన సినిమా పరిశ్రమ వల్ల ఎంత లాభపడ్డాడో ప్రతి ఒక్కరికి తెల్సిందే అంటూ విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అదే విమర్శలు కాజల్‌ ఎదుర్కొంటోంది.

తాజాగా కాజల్‌ సీసీసీకి రెండు లక్షల విరాళం ఇచ్చిన విషయం తెల్సిందే. కాజల్‌ తీసుకునే పారితోషికం ముందు ఆమె ఇచ్చిన విరాళం నవ్వుతెప్పించే విధంగా ఉందంటూ కామెంట్స్‌ వస్తున్నాయి. సినిమాకు కోటిన్నర రెండు కోట్లు తీసుకునే కాజల్‌ జోక్‌ గా రెండు లక్షల రూపాయలను విరాళంగా ఇవ్వడం ఏంటీ అంటున్నారు. రెండు లక్షల విరాళంను కూడా చిరంజీవి స్వయంగా ఫోన్‌ చేసి ఒత్తిడి చేస్తేనే ఆమె ఇచ్చిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

కాజల్‌ ఈమద్య క్రేజ్‌ కాస్త తగ్గింది కాని ఆమె నటించిన సినిమాలు తీసుకున్న పారితోషికం ప్రస్తుతం సౌత్‌ లో ఉన్న హీరోయిన్స్‌ ఎవరు కూడా తీసుకోలేదు అంటూ టాక్‌ ఉంది. అంతటి కాజల్‌ రెండు లక్షలు ఇవ్వడం విడ్డూరం. నయన్‌ తార పాతిక లక్షల విరాళం ఇచ్చిన విషయాన్ని ఈ సందర్బంగా కొందరు ఆమెకు గుర్తు చేస్తున్నారు. అయితే కాజల్‌ ఫ్యాన్స్‌ మాత్రం ఈ రెండు లక్షల విరాళం కూడా ఇవ్వని వారు చాలా మంది ఉన్నారు. వారి పరిస్థితి ఏంటీ అంటూ ప్రశ్నిస్తున్నారు.