ప్రభాస్‌ తో చేస్తా.. పూరి సర్ ను అడుగుతూనే ఉన్నా

తెలుగు ప్రేక్షకులకు ఏక్‌ నిరంజన్ సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ కంగనా రనౌత్‌ ఆ తర్వాత బాలీవుడ్‌ లో బిజీ అయ్యింది. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోల రేంజ్ లో ఈ అమ్మడు సినిమా చేస్తూ వస్తోంది. ఎట్టకేలకు ఈమె హీరోయిన్ గా నటించిన తలైవి సినిమా తెలుగు లో డబ్బింగ్‌ అయ్యింది. ఈ వారంలో విడుదల కాబోతున్న తలైవి సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌ కు కంగనా వచ్చింది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ టాలీవుడ్‌ లో సినిమా చేయాలని ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

మళ్లీ తెలుగు లో ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ ప్రశ్నించగా నేను చాలా కాలంగా పూరి సర్‌ ను అడుగుతున్నాను. ఆయన నుండి ఒక స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాను. ఆయన ఆఫర్‌ ఇస్తాడని ఎదురు చూస్తున్నాను అంటూ చెప్పకొచ్చింది. ప్రభాస్‌ తో కూడా నటించాలని ఉంది అంటూ కంగనా చెప్పుకొచ్చింది. పూరి సర్‌ తోనే ప్రభాస్ గారితో అవకాశం ఇప్పించాలంటూ విజ్ఞప్తి చేస్తున్నాను అంటూ కంగనా మీడియాతో మాట్లాడుతూ చెప్పుకొచ్చింది. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా తలైవి సినిమా ఉంటుంది అంటూ ఆమె నమ్మకంగా చెబుతోంది.