రాహు కేతు పూజలో బాలీవుడ్ తలైవి

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఏపీ లోని తిరుపతి మరియు శ్రీకాళహస్తి దేవాలయాలు సందర్శించారు. శనివారం తెల్లవారుజామున వీఐపీ బ్రేక్ సమయంలో తిరుమలలోని శ్రీవారి ని దర్శించుకున్నారు. ఆ తర్వాత వేద పండితులు కంగనా కు రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు ఇచ్చి పట్టువస్త్రాలతో సత్కరించి ప్రసాదం ఇచ్చారు. ఆ సమయంలో కంగనా తన మొక్కులను శ్రీవారికి చెల్లించారు. తెల్లవారే వరకు తిరుమల నుండి తిరుగుముఖం పట్టిన కంగనా అటు నుండి అటు శ్రీకాళహస్తి దేవాలయం కు వెళ్లారు. అక్కడ రాహు కేతు పూజల్లో పాల్గొన్నారు. కంగనా తో స్వయంగా వైకాపా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఉండి ఆమెకు దర్శనం చేయించారు.

కంగనా కు శ్రీకాళహస్తి ముక్కంటి దర్శనంను వేద పండితులు చేయించి ఆ తర్వాత ఆశీర్వచనాలు ఇచ్చి ప్రసాదంను ఇచ్చి పట్టు వస్త్రాలతో సత్కరించారు. అంతకు ముందు దేవాలయంలోనే రాహు కేతు పూజలు వేద పండితులు నిర్వహించగా కంగనా పాల్గొన్నారు. కంగనా ఉన్నట్టుండి తిరుమల మరియు శ్రీకాళహస్తి దేవాలయం దర్శనం రావడంతో ఏపీ పోలీసులు హడావుడి చేశారు. ఆమెకు పెద్ద ఎత్తున భద్రతను కల్పించారు. ఆమె పై కేసులు ఉండటంతో పాటు కొందరు రైతులు ఆమెను చంపేస్తామని కొన్ని రోజుల క్రితం హెచ్చరించినట్లుగా పోలీసు కేసు కూడా నమోదు అయ్యింది. అందుకే ఆమెకు హై సెక్యూరిటీ ఏపీ పోలీసులు కనిపించినట్లుగా తెలుస్తోంది.

ఇక కంగనా సినిమాల విషయానికి వస్తే తలైవి సినిమా తో ఆమె ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి అయిన జయలలిత బయోపిక్ గా ఆ సినిమా రూపొందిన విషయం తెల్సిందే. ఆ సినిమా తో నటిగా కంగనా కు మంచి పేరు వచ్చింది. మరో వైపు ఆమె రెండు సినిమాలను చేస్తోంది. సొంత దర్శకత్వంలో కూడా కంగనా సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ లో రెబల్ హీరోయిన్ గా పేరు దక్కించుకున్న కంగనా రనౌత్ ఆఫర్ల విషయంలో ఎప్పుడు కూడా తగ్గేదే లే అన్నట్లుగా సినిమాలు దక్కించుకుని వరుసగా సినిమాలు వచ్చే రెండేళ్లలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.